News January 24, 2025
పిట్లం: పేకాట ఆడుతున్న 9 మంది అరెస్టు

పిట్లం శివారులోని ఓ ధాబాలో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. ఎస్ఐ రాజు వివరాలిలా.. శివారులోని ఓ ధాబాలో పేకాట నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు శుక్రవారం దాడి చేసి 9 మందిని అరెస్టు చేశామన్నారు. వారి నుంచి రూ.5650 నగదు, 10 సెల్ ఫోన్లు, రెండు బైకులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అసాంఘిక చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
Similar News
News November 22, 2025
విద్యార్థినుల కోసం కొత్త పథకం: మంత్రి లోకేశ్

AP: వచ్చే ఏడాది నుంచి ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థినులకు ‘కలలకు రెక్కలు’ పథకాన్ని అమలు చేస్తామని మంత్రి లోకేశ్ తెలిపారు. దీనిపై విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ‘దేశవిదేశాల్లో ఉన్నత విద్య చదవాలనే విద్యార్థినులకు ఆర్థిక సాయం అందిస్తాం. ప్రస్తుతం విదేశాల్లో APకి చెందిన 27,112 మంది, స్వదేశంలో 88,196 మంది విద్యార్థినులు ఉన్నత చదువులు చదువుతున్నారు’ అని ట్వీట్ చేశారు.
News November 22, 2025
వరంగల్ సెంట్రల్ జైలు నిర్మాణం ఎప్పుడు..?

నిజాం కాలం నాటి WGL సెంట్రల్ జైలు 2021లో కూల్చగా, మామునూరులో కొత్త జైలు నిర్మిస్తామని ప్రకటించినా నాలుగున్నరేళ్లుగా పనులు మొదలుకాలేదు. వెయ్యి మంది ఖైదీలను ఇతర జైళ్లకు మార్చడంతో వారి కుటుంబాలు కలుసుకోవడానికే ఇబ్బందులు పడుతున్నారు.101 ఎకరాలు కేటాయించినా బడ్జెట్ లేక పనులు నిలిచాయి. ప్రస్తుతం మామునూరులో 20 మంది ఖైదీలకు 40 మంది సిబ్బంది పని చేస్తుండగా, కొత్త జైలు నిర్మాణంపై ప్రభుత్వం స్పందించడం లేదు.
News November 22, 2025
CSIR-NML 67 పోస్టులకు నోటిఫికేషన్

<


