News January 24, 2025

పిట్లం: పేకాట ఆడుతున్న 9 మంది అరెస్టు

image

పిట్లం శివారులోని ఓ ధాబాలో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. ఎస్ఐ రాజు వివరాలిలా.. శివారులోని ఓ ధాబాలో పేకాట నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు శుక్రవారం దాడి చేసి 9 మందిని అరెస్టు చేశామన్నారు. వారి నుంచి రూ.5650 నగదు, 10 సెల్ ఫోన్లు, రెండు బైకులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అసాంఘిక చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

Similar News

News November 20, 2025

MHBD: వృద్ధురాలి దారుణ హత్య.. UPDATE

image

MHBD(D) రామన్నగూడెంలో నిన్న <<18334484>>వృద్ధురాలు హత్యకు<<>> గురైన విషయం తెలిసిందే. స్థానికులు, పోలీసుల ప్రకారం.. కురవి(M)కి చెందిన పద్మ భర్త మృతి చెందడంతో 2వ కూతురి ఇంట్లో ఉంటోంది. కూతురు, అల్లుడు HYDలో ఉంటుండగా ఒంటరిగా ఉంటోంది. ఉదయం నుంచి పద్మ బయటికి రాకపోవడంతో స్థానికులు వెళ్లి చూడగా రక్తపు గాయాలతో పడి ఉంది. SI రమేశ్ బాబు కేసు నమోదు చేశారు. బంగారం కోసమా? అత్యాచారంచేసి హత్య చేశారా? అనేది దర్యాప్తులో తేలనుంది.

News November 20, 2025

విశాఖ: ‘2025-26 సంవత్సరానికి కాఫీ కొనుగోలు ధరల ప్రకటన’

image

2025-26 సంవత్సరానికి కాఫీ కొనుగోలు ధరలను విశాఖలో జరిగిన సమవేశంలో అపెక్స్ కమిటీ ప్రతినిధులు ప్రకటించారు. అరెబికా పార్చ్‌మెంట్ రకం (KG) రూ.450, అరెబికా చెర్రీ రూ.270, రోబస్టా చెర్రీ కాఫీ రూ.170 చొప్పున నిర్ణయించారు. గిరిజన కాఫీ రైతుల సంక్షేమం కోసం ధరలను పెంచామన్నారు. ఈ విషయాన్ని పాడేరు ఏజెన్సీలోని గిరిజన కాఫీ రైతులందరికీ విస్తృత అవగాహన కల్పించాలని GCC సిబ్బందిని అధికారులు ఆదేశించారు.

News November 20, 2025

ముప్కాల్: రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

image

తూప్రాన్ పట్టణ పరిధి కరీంగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై శివానందం తెలిపారు. ముప్కాల్ గ్రామానికి చెందిన పన్నీర్ వెంకటేష్(24) ప్రేమ వివాహం చేసుకొని హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. ఈ నెల 16న ఆర్మూర్ నుంచి హైదరాబాద్ వెళుతుండగా ద్విచక్ర వాహనం అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై చెప్పారు.