News February 21, 2025
పిట్లం: ప్రతిభ.. పతకాల పంట పండిస్తోంది..!

కిక్ బాక్సింగ్, చెస్ బాక్సింగ్, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఇలా.. 8 రకాల క్రీడల్లో సత్తా చాటుతోంది కామారెడ్డి జిల్లా పిట్లం వాసి తక్కడ్ పల్లి ప్రతిభ. అనితర సాధ్యమైన విజయాలతో పతకాల పంట పండిస్తోంది. ఈ నెల 19న ఖేలో ఇండియా రాష్ట్ర స్థాయి వుమెన్ వుషూ లీగ్ పోటీలు ఆదిలాబాద్ లో జరిగాయి. ఈ పోటీల్లో ప్రతిభ 45 కేజీ ల విభాగంలో రాణించి పసిడి పతకాన్ని ముద్దాడింది. దీంతో ఆమె ఖేలో ఇండియా స్కాలర్షిప్కు ఎంపికైంది.
Similar News
News December 1, 2025
రాజీనామాను ఉపసంహరించుకున్న MLC జకియా ఖానం

తన రాజీనామాను ఉపసంహరించుకున్నట్లు మండలి డిప్యూటీ స్పీకర్ జకియా ఖానం మండలి ఛైర్మన్ మోషేన్ రాజుకు తెలిపారు. ఎమ్మెల్సీల రాజీనామాలపై మండలి ఛైర్మన్ మోషేన్ రాజు సోమవారం విచారణ జరిపారు. 6 నెలల్లో తన పదవి కాలం పూర్తవుతుందని, ఇప్పుడు రాజీనామా చేసినా ఎటువంటి ఉపయోగం ఉండదని ఛైర్మన్ సూచించడంతో ఆమె తన రాజీనామాను ఉపసంహరించుకున్నారు. YCP తరఫున MLC గా ఎన్నికైన ఆమె పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు.
News December 1, 2025
అనకాపల్లి జిల్లాలో TODAY TOP NEWS

➤ గంజాయి కేసులో నలుగురికి 10 ఏళ్ల జైలు శిక్ష
➤ PGRS లో ఫిర్యాదులు వెల్లువ
➤ పింఛన్లు పంపిణీలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు
➤ గృహ,ఇంటి స్థలం దరఖాస్తుకు గడువు పెరిగింది: బత్తుల తాతయ్యబాబు
➤ ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీలు
➤ రాజాంలో ఎనిమిది మంది పేకాట రాయుళ్ల అరెస్ట్
➤ జాతీయస్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు ముగ్గురు విద్యార్థులు ఎంపిక
➤డి.యర్రవరంలో బాలికల వసతి గృహాన్ని ప్రారంభించిన స్పీకర్
News December 1, 2025
NGKL: ధాన్యం తడవకుండా ముందు జాగ్రత్త చర్యలు: కలెక్టర్

జిల్లాలో ఈనెల 2, 3 తేదీలలో జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ బదావత్ సంతోష్ సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరి ధాన్యం, పత్తి తడవకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. కోత కోసి కల్లాలలో ఉన్న వరి ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.


