News January 30, 2025

పిట్లం: ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి

image

పిట్లం మండల కేంద్రానికి చెందిన ఆరేటి కిరణ్ ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ఆరేటి కిరణ్ బతుకుదెరువు కోసం మేడ్చల్ జిల్లాకు వెళ్లారు. బుధవారం మేడ్చల్‌లోని చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందినట్లు వివరించారు.

Similar News

News September 19, 2025

TDPలో చేరనున్న ముగ్గురు YCP ఎమ్మెల్సీలు?

image

AP: వైసీపీ ఎమ్మెల్సీలు బల్లి కల్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్ టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వైసీపీకి, ఎమ్మెల్సీ పదవులకు వీరు ముగ్గురు రాజీనామా చేశారు. కాగా వీరి రాజీనామాలపై మండలి ఛైర్మన్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.

News September 19, 2025

పవన్ హాన్స్ లిమిటెడ్‌లో 13 ఉద్యోగాలు

image

భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పవన్ హాన్స్ లిమిటెడ్‌లో 13 పోస్టులకు ప్రకటన వెలువడింది. అసిస్టెంట్ మేనేజర్, సేఫ్టీ మేనేజర్ తదితర ఉద్యోగాలను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తారు. పోస్టును బట్టి B.Tech/B.E, M.A, MCA, డిగ్రీ పూర్తయిన వారు, CHPL/ATPL లైసెన్సు ఉన్నవారు అర్హులు. దరఖాస్తుకు చివరి తేదీ OCT 12. పూర్తి వివరాల కోసం <>https://www.pawanhans.co.in/<<>> వెబ్‌సైట్‌ను సంప్రదించగలరు.

News September 19, 2025

దసరా సెలవుల వేళ.. HYD విద్యార్థులకు గుడ్‌న్యూస్

image

దసరా సెలవులు వచ్చాయంటే విద్యార్థులకు ఆనందమే.. ఆనందం.. సిటీలో ఉన్న లక్షలాది మంది విద్యార్థులు సొంతూరికి వెళతారు. ఈ క్రమంలో వారు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు ఆర్టీసీ ఈడీ రాజశేఖర్‌ తెలిపారు. నగరంలోని పలు ప్రాంతాల నుంచి వీటిని ఏర్పాటు చేశామన్నారు. బస్సుల వివరాల కోసం 9959226148, /6142, / 6136/ 6129 నంబర్లకు ఫోన్ చేయాలన్నారు.