News February 18, 2025

పిట్లం: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి.. మరొకరికి పరిస్థితి విషమం

image

పిట్లం శివారులోని NH- 161 పై మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళా మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న హైవే సిబ్బంది ఘటన స్థలికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తికి చికిత్స నిమిత్తం పిట్లం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం బాన్సువాడ ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 14, 2025

సంగారెడ్డి: ‘ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లు రూల్స్ పాటించాలి’

image

జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రులు స్కానింగ్ సెంటర్లు నిబంధనలు పాటించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీ దేవి తెలిపారు. జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో గురువారం సమావేశం నిర్వహించారు. నిబంధనలు పాటించని ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేయవద్దని సూచించారు. ఆసుపత్రిలో జరిగే జనన, మరణ వివరాలను రెగ్యులర్‌గా సమర్పించాలని తెలిపారు.

News March 14, 2025

హనుమకొండ: ప్రజలకు హోళీ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ 

image

హోళీ పండుగను పురస్కరించుకుని కలెక్టర్ పి.ప్రావిణ్య జిల్లా ప్రజలకు హోళీ వేడుక శుభాకాంక్షలు తెలిపారు. రాగద్వేషాలకు అతీతంగా అందరినీ ఒక్కచోట చేర్చే ఈ హోళీ వేడుక ప్రజలందరి జీవితాలలో సంతోషపు వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలు ఆనందోత్సాహాలతో హోళీ వేడుక జరుపుకోవాలని అభిలషించారు. సహజ రంగులను వినియోగిస్తూ సంప్రదాయబద్ధంగా హోళీ నిర్వహించుకోవాలని హితవు పలికారు. 

News March 14, 2025

రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఈరోజు ఒక చీకటి రోజు: హ‌రీశ్‌రావు

image

రాష్ట్ర అసెంబ్లీ చ‌రిత్ర‌లో ఈరోజు ఒక చీక‌టి రోజు అని సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జ‌గ‌దీశ్ రెడ్డిని అసెంబ్లీ నుంచి స‌స్పెండ్ చేసిన అనంత‌రం నెక్లెస్ రోడ్డులోని డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ విగ్ర‌హం వ‌ద్ద హ‌రీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ స్పీకర్‌గా ప్రసాద్‌ను ప్రతిపాదించినప్పుడు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని గుర్తు చేశారు.

error: Content is protected !!