News February 18, 2025
పిట్లం: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి.. మరొకరికి పరిస్థితి విషమం

పిట్లం శివారులోని NH- 161 పై మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళా మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న హైవే సిబ్బంది ఘటన స్థలికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తికి చికిత్స నిమిత్తం పిట్లం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం బాన్సువాడ ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 20, 2025
GWL: ఆ పాఠశాల గుర్తింపును రద్దు చేయాలి- కురువ పల్లయ్య

స్టూడెంట్ను మోకాళ్లపై నడిపించి గాయాలు అయ్యేందుకు కారణమైన వడ్డేపల్లి మండలంలోని శారద విద్యానికేతన్ గుర్తింపును రద్దు చేయాలని BRSV గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య పేర్కొన్నారు. గురువారం గద్వాలలో మీడియాతో మాట్లాడారు. తల్లిదండ్రులు ఎంతో ఆశతో వేలకు వేలు ఫీజు చెల్లించి, విద్యాబుద్ధులు నేర్పమని పంపితే అనాగరికంగా విద్యార్థులను ఇబ్బందికి గురి చేయడమేంటంటూ ప్రశ్నించారు.
News November 20, 2025
వరంగల్: పోలీస్ సిబ్బందికి రేపు ఉచిత వైద్య శిబిరం

వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో రేపు (శుక్రవారం) ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నారు. ఈ శిబిరంలో పోలీస్ సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రముఖ వైద్య నిపుణుల ద్వారా వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఈ అవకాశాన్ని సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలని పోలీస్ కమిషనర్ (సీపీ) సన్ ప్రీత్ సింగ్ విజ్ఞప్తి చేశారు.
News November 20, 2025
సంగారెడ్డి: రేపటి నుంచి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు

సంగారెడ్డి జిల్లాలోని అన్ని మండలాల్లో రేపటి నుంచి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించాలని డీఈఓ వెంకటేశ్వర్లు ఆదేశించారు. ఆయన గురువారం మాట్లాడుతూ.. ఈ నెల 21, 22 తేదీల్లో ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులకు, 24, 25 తేదీల్లో ప్రాథమికోన్నత స్థాయి ఉపాధ్యాయులకు సమావేశాలు జరుగుతాయని తెలిపారు. ఈ సమావేశాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఎంఈవోలకు సూచించారు.


