News December 8, 2024

పిట్లం: వివాహిత ఆత్మహత్య.. కారణమిదే..!

image

పిట్లం మండలం ఖంబాపూర్ గ్రామంలో వివాహిత ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఎస్సై రాజు వివరాలిలా.. ఖంబాపూర్ గ్రామానికి చెందిన ఎర్ర మీనా (25) తన భర్త అయిన సాయిలుతో శుక్రవారం రాత్రి కుటుంబ సమస్యల విషయంలో గొడవ జరిగింది. మనస్తాపం చెందిన ఆమె శనివారం ఇంట్లో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలి తల్లి అంజవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు.

Similar News

News January 24, 2025

NZB: ఉరివేసుకొని మహిళ ఆత్మహత్య

image

అనారోగ్య సమస్యలతో ఓ మహిళ ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు 3వ టౌన్ ఎస్ఐ హరిబాబు తెలిపారు. ఆదర్శనగర్‌కు చెందిన లక్ష్మీ 52 కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది. ఆమె భర్తకు ఏడాది క్రితం హార్ట్ ఆపరేషన్ అయింది. దీంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న 3వ టౌన్ ఎస్ఐ హరిబాబు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.

News January 24, 2025

NZB: లారీ ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి

image

నిజామాబాద్ ఆర్సపల్లి బైపాస్ రోడ్డులో లారీ ఢీకొని ఓ రైతు మృతి చెందినట్లు ఆరో టౌన్ ఎస్సై వెంకట్రావు గురువారం తెలిపారు. ఆర్సపల్లికి చెందిన తరికంటి యాదయ్య(78) అర్సపల్లి శివారులోని తన వ్యవసాయ భూమిలో పని ముగించుకుని బైక్‌పై ఇంటికి వెళ్తుండగా రైల్వే గేటు మూల మలుపు వద్ద లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యాదయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News January 24, 2025

NZB: గంజాయితో ఒకరి అరెస్ట్

image

నిజామాబాద్ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ పోలీసులు గురువారం ఒకరిని గంజాయితో అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ పి.స్వప్న తెలిపారు. నగరంలో తనిఖీలు నిర్వహిస్తుండగా జునైద్ అనే ఓ యువకుడు 0.7 కిలోల గంజాయితో పట్టుబడ్డాడన్నారు. ఈ మేరకు నిందితుడిని అరెస్ట్ చేసినట్లు స్వప్న వివరించారు. ఈ తనిఖీల్లో ఎస్సై బి.రాం కుమార్, హెడ్ కానిస్టేబుళ్లు రాజన్న, భూమన్న, కానిస్టేబుళ్లు భోజన్న, సుకన్య పాల్గొన్నారన్నారు.