News April 9, 2025
పిట్లం: Way2News ఎఫెక్ట్..’వన్యప్రాణుల దప్పిక తీరింది’

ఎండాకాలం తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పిట్లం అటవీ ప్రాంతంలో నీటి కొరత కారణంగా అడవిలోని మూగజీవాలు దాహంతో అల్లాడుతున్నాయి. దాహార్తి తీర్చేందుకు ఏర్పాటు చేసిన సాసర్ పిట్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఈ నెల 7న <<16018843>>’వన్య ప్రాణుల గొంతెండుతోంది’ <<>>అనే శీర్షికతో Way2Newsలో కథనం ప్రచురితమైంది. స్పందించిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రవికుమార్ బుధవారం సాసర్ పిట్లలలో నీటి ట్యాంకర్ సహాయంతో నీటిని నింపారు.
Similar News
News April 21, 2025
ఆదోని సబ్ కలెక్టర్ ఆఫీసులో ప్రజా గ్రీవెన్స్

ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సమావేశ మందిరంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసెల్ సిస్టమ్ – పిజిఆర్ఎస్) కార్యక్రమం సోమవారం జరిగింది. సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ గ్రీవెన్స్ వచ్చిన ప్రజా సమస్యలను తెలుసుకొని వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ శ్రీనివాసరాజు, వేణు సూర్య, డిఎల్పిఓ నూర్జహాన్, డిఎల్డిఓ రమణ రెడ్డి పాల్గొన్నారు.
News April 21, 2025
ఆర్జీదారుల వద్దకు వెళ్లి వినతులు స్వీకరించిన సబ్ కలెక్టర్

ప్రజల నుంచి వచ్చిన వినతులను సకాలంలో పరిష్కరించాలని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆదేశించారు. అదోనిలోని సబ్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసెల్ సిస్టమ్- పిజిఆర్ఎస్) కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులను సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ స్వీకరించారు. సమస్య ప్రాధాన్యతను బట్టి ఆయా శాఖల అధికారులకు సిఫార్సు చేస్తున్నట్లు తెలిపారు.
News April 21, 2025
విజయనగరం: ఘనంగా సివిల్ సర్వీసెస్ డే

సివిల్ సర్వీస్ అధికారులు నిబద్ధత నిజాయతీగా ఉండి పేదలకు న్యాయం జరిగేలా చూడాలని జిల్లా పౌరవేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ అన్నారు. సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా కలెక్టరేట్లో పౌర వేదిక ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ను ఘనంగా సత్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. సివిల్ సర్వీసెస్ అధికారుల పని తీరులో రాజకీయ నాయకుల జోక్యం లేకుండా అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని సూచించారు.