News March 28, 2025

పిఠాపురంపై పూర్తి ఫోకస్ పెట్టిన డిప్యూటీ సీఎం

image

DYCM పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గంపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు. ఇటీవల పిఠాపురం రూరల్ ఎస్సై ఏసీబీకి దొరికిపోయారు. గురువారం సోషల్ మీడియాలో పవన్ ఓ పోస్ట్ పెట్టారు. ప్రతివారం పిఠాపురంపై సమీక్షిస్తానని, వేసవిలో నీటి సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని అధికారులను అదేశించారు. పిఠాపురం పరిధిలోని పోలీస్ స్టేషన్‌ల పరిస్థితిపై ఇంటిలిజెన్స్ నివేదిక తీసుకోవాలని సూచించినట్లు అధికారులు పేర్కొన్నారు.

Similar News

News July 11, 2025

ఫీజులు పెంచాలన్న అభ్యర్థనను తిరస్కరించిన HC

image

TG: ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలకు హైకోర్టులో చుక్కెదురైంది. ఫీజులు పెంచాలన్న పలు కాలేజీల అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు వారాల్లోగా ఫీజులు నిర్ణయించాలని ఫీజుల నియంత్రణ కమిటీని ఆదేశించింది. కమిటీ నిర్ణయంపైనే ఫీజుల పెంపు ఆధారపడి ఉంటుందని కాలేజీలకు న్యాయస్థానం స్పష్టం చేసింది.

News July 11, 2025

జగిత్యాల మెడికల్‌ ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు స్వీకరించిన డా. షర్మిల

image

జగిత్యాల ప్రభుత్వ వైద్య కళాశాల కొత్త ప్రిన్సిపాల్‌గా డాక్టర్‌ జి. షర్మిల గురువారం బాధ్యతలు స్వీకరించారు. వరంగల్‌లోని క్యాతం చందయ్య మెమోరియల్‌ మెటర్నిటీ ఆసుపత్రిలో గైనకాలజీ ప్రొఫెసర్‌గా, సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ఆమెను పదోన్నతిపై జగిత్యాల మెడికల్‌ కళాశాల ప్రిన్సిపల్‌గా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం కళాశాలకు వచ్చిన ఆమెకు సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు.

News July 11, 2025

చనిపోయినట్లు ప్రకటించిన 12 గంటలకు లేచిన శిశువు!

image

మహారాష్ట్రలో ఓ వింత సంఘటన జరిగింది. చనిపోయిందనుకున్న శిశువు 12 గంటల తర్వాత తిరిగి బతికింది. బీద్‌లోని రామానంద తీర్థ్ ఆస్పత్రిలో ఓ మహిళ 7వ నెలలోనే 900 గ్రాములున్న శిశువుకు జన్మనిచ్చింది. ఆ బేబీని రాత్రంతా ICUలో ఉంచి ఆ తర్వాత చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. ఖననం చేసే సమయంలో ముసుగు తీసి చూడగా కదలాడుతున్నట్లు కనిపించింది. వెంటనే వారు ఆ శిశువును మరో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.