News March 28, 2025

పిఠాపురంపై పూర్తి ఫోకస్ పెట్టిన డిప్యూటీ సీఎం

image

DYCM పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గంపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు. ఇటీవల పిఠాపురం రూరల్ ఎస్సై ఏసీబీకి దొరికిపోయారు. గురువారం సోషల్ మీడియాలో పవన్ ఓ పోస్ట్ పెట్టారు. ప్రతివారం పిఠాపురంపై సమీక్షిస్తానని, వేసవిలో నీటి సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని అధికారులను అదేశించారు. పిఠాపురం పరిధిలోని పోలీస్ స్టేషన్‌ల పరిస్థితిపై ఇంటిలిజెన్స్ నివేదిక తీసుకోవాలని సూచించినట్లు అధికారులు పేర్కొన్నారు.

Similar News

News April 21, 2025

BE READY: రేపు మ.12 గంటలకు..

image

TG: ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు రేపు మ.12 గం.కు విడుదల కాబోతున్నాయి. మార్చి 5 నుంచి 25వ తేదీ వరకు పరీక్షలు జరిగాయి. దాదాపు 9.5లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాశారు. Way2News యాప్ ద్వారా ఎలాంటి యాడ్స్ లేకుండా వేగంగా ఫలితాలు తెలుసుకోవచ్చు. కేవలం హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే చాలు. మార్క్స్ లిస్టును ఈజీగా మీ సన్నిహితులకు షేర్ చేయొచ్చు.
*విద్యార్థులకు Way2News తరఫున BEST OF LUCK

News April 21, 2025

జంబ్లింగ్ విధానంలో ఏయూ డిగ్రీ పరీక్షలు: రిజిస్ట్రార్

image

ఏయూ పరిధిలో డిగ్రీ రెండు, నాలుగో సెమిస్టర్ పరీక్షలను జంబ్లింగ్ విధానంలో నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య ఇ.ఎన్ ధనంజయరావు తెలిపారు. ఉమ్మడి విశాఖ, విజయనగరం జిల్లాల పరిధిలో 180 కాలేజీల విద్యార్థులకు జంబ్లింగ్ విధానంలో 91 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రెండో సెమిస్టర్ విద్యార్థులకు ఉ.9 నుంచి 12 వరకు, నాలుగో సెమిస్టర్ విద్యార్థులకు మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు పరీక్షలు నిర్వహిస్తారు.

News April 21, 2025

నూజివీడు: విహారయాత్రకు వెళ్లి విషాదం నింపాడు

image

నూజివీడు మండలం బత్తుల వారి గూడెం గ్రామానికి చెందిన యువకుడు పావులూరి శ్యామ్ కుమార్ (20) ఎన్టీఆర్ జిల్లా గుంటుపల్లి రేవు వద్ద విహారయాత్రకు వెళ్లి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న అధికారులు గాలింపు చర్యలు చేపట్టగా సోమవారం మృతదేహాన్ని వెలికి తీశారు. ఈ సంఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. శ్యాం కుమార్ ఐటీఐ చదివి అప్రెంటిస్ పూర్తి చేసుకుని విజయవాడలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.

error: Content is protected !!