News August 9, 2024

పిఠాపురంలో ‘కమిటీ కుర్రోళ్లు’ సెలబ్రేషన్స్.. నిహారిక ఏమన్నారో తెలుసా?

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫ్రీ అయ్యాక ‘కమిటీ కుర్రోళ్లు’ మూవీ చూపిస్తానని నిర్మాత కొణిదెల నిహారిక తెలిపారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. పిఠాపురంలో గురువారమే ప్రీమియర్స్ అయ్యాయని అన్నారు. చిత్ర యూనిట్ అక్కడి వారితో కలిసి మూవీని చూడాలనుకుంటున్నారని వెల్లడించారు. మూవీ సెలబ్రేషన్స్ ప్రస్తుతానికి తమ ఆఫీస్‌లో ప్లాన్ చేశామని, పిఠాపురంలో ప్లాన్ చేస్తే తప్పకుండా చెబుతామని అన్నారు.

Similar News

News December 9, 2025

తూ.గో: విదేశీ ఉద్యోగాల ఎర.. రూ.4 కోట్లకు టోకరా

image

విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను నమ్మించి రూ. 4 కోట్లు వసూలు చేసిన ఘరానా మోసం నిడదవోలు మండలం గోపవరంలో ఆలస్యంగా వెలుగుచూసింది. యంట్రపాటి విజయలక్ష్మి, భాగ్యం తదితరులు తమను నిండా ముంచారని బాధితులు వాపోయారు. డబ్బులు తిరిగి అడిగితే ముఖం చాటేస్తున్నారని, తమకు న్యాయం చేయాలంటూ సోమవారం కలెక్టర్, జిల్లా జడ్జికి వారు ఫిర్యాదు చేశారు.

News December 9, 2025

విదేశీ ఉద్యోగాల ఎర.. రూ.4 కోట్లకు టోకరా

image

విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను నమ్మించి రూ. 4 కోట్లు వసూలు చేసిన ఘరానా మోసం నిడదవోలు మండలం గోపవరంలో ఆలస్యంగా వెలుగుచూసింది. యంట్రపాటి విజయలక్ష్మి, భాగ్యం తదితరులు తమను నిండా ముంచారని బాధితులు వాపోయారు. డబ్బులు తిరిగి అడిగితే ముఖం చాటేస్తున్నారని, తమకు న్యాయం చేయాలంటూ సోమవారం కలెక్టర్, జిల్లా జడ్జికి వారు ఫిర్యాదు చేశారు.

News December 9, 2025

రాజమండ్రి: ప్లాస్టిక్ రహిత నగరం వైపు.. ‘రీసైక్లింగ్ లీగ్’

image

RJYలో ప్లాస్టిక్ కాలుష్య నియంత్రణే లక్ష్యంగా నగరపాలక సంస్థ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సోమవారం కార్పొరేషన్ కార్యాలయంలో ‘ప్లాస్టిక్ రీసైక్లింగ్ లీగ్’ పోస్టర్‌ను కమిషనర్ రాహుల్ మీనా ఆవిష్కరించారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే ముప్పుపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు లీగ్ దోహదపడుతుందన్నారు. విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పించేందుకు పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు.