News February 18, 2025
పిఠాపురంలో జనసేన ఆవిర్భావ వేడుకలకు గ్రీన్ సిగ్నల్

జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలను మార్చి 14వ తేదీన పిఠాపురంలో నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. దీనికి ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆమోదం తెలిపినట్లు ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు పిఠాపురంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. కాగా ఎన్నికల్లో ఘన విజయం అనంతరం జనసేన నిర్వహిస్తున్న తొలి సభ కానుండటంతో కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించేందుకు పార్టీ కసరత్తు చేస్తోంది.
Similar News
News November 9, 2025
రేవంత్ సర్టిఫికెట్ నాకు అవసరం లేదు: కిషన్ రెడ్డి

TG: BJP, BRS కలిసిపోయాయని రేవంత్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారంలో మాట్లాడుతూ ‘రేవంత్ వ్యక్తిగత విమర్శలకు దిగినా భయపడను. రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఆయన సర్టిఫికెట్ నాకు అవసరం లేదు. రాష్ట్ర అభివృద్ధికి BJP ఏం చేసిందో నాకు తెలుసు. రూ.లక్ష కోట్ల అవినీతిని బయట పెడతామని రాహుల్, రేవంత్ చెప్పి రూ.లక్ష కూడా వెలికితీయలేదు’ అని ఎద్దేవా చేశారు.
News November 9, 2025
10న ‘మీ కోసం’ రద్దు: ఎస్పీ

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 11న జిల్లాకు రానున్నారు. ఈక్రమంలో ఈనెల 10న జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించనున్న ‘మీ కోసం’ కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు శనివారం తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. దూర ప్రాంతాల నుంచి ఎవరూ ‘మీ కోసం’ కార్యక్రమానికి రావద్దని సూచించారు.
News November 9, 2025
జగిత్యాల: క్వింటాల్ మక్కలు రూ.2,071

జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో వివిధ దినుసుల ధరలు ఇవాళ ఇలా ఉన్నాయి. మక్కలు క్వింటాల్ గరిష్ఠ ధర రూ.2,071, కనిష్ఠ ధర రూ.1,600, వరి ధాన్యం(1010) గరిష్ఠ ధర రూ.1,940, కనిష్ఠ ధర రూ.1,750, వరి ధాన్యం(BPT) గరిష్ఠ ధర రూ.2,041, కనిష్ఠ ధర రూ.1,980, వరి ధాన్యం(JSR) గరిష్ఠ ధర రూ.2,585, కనిష్ఠ ధర రూ.1,800గా పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు.


