News February 18, 2025

పిఠాపురంలో జనసేన ఆవిర్భావ వేడుకలకు గ్రీన్ సిగ్నల్

image

జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలను మార్చి 14వ తేదీన పిఠాపురంలో నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. దీనికి ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆమోదం తెలిపినట్లు ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు పిఠాపురంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. కాగా ఎన్నికల్లో ఘన విజయం అనంతరం జనసేన నిర్వహిస్తున్న తొలి సభ కానుండటంతో కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించేందుకు పార్టీ కసరత్తు చేస్తోంది.

Similar News

News October 24, 2025

విద్యార్థిని ఆత్మహత్య.. విచారణకు ఆదేశించిన పొన్నం

image

భీమదేవరపల్లి మండలం వంగరలోని పీవీ గురుకుల పాఠశాలలో టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. విద్యార్థిని ఆత్మహత్య ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హుజురాబాద్ మండలం రాంపూర్‌కి చెందిన విద్యార్థిని ఘటనపై హనుమకొండ కలెక్టర్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పూర్తి స్థాయి విచారణ జరపాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

News October 24, 2025

జన్నారం: 9 నెలల చిన్నారితో కలిసి తల్లి సూసైడ్

image

మంచిర్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జన్నారం మండలం మందపల్లిలో బావిలో దూకి తల్లి తన 9నెలల కూతురితో కలిసి సూసైడ్ చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం లక్షెట్టిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News October 24, 2025

‘గూగుల్ తల్లి’ గుండెల్లో Ai గుబులు

image

గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌కు ఇకపై టెస్టింగ్ టైమ్. చాట్ GPT ఈమధ్యే అట్లాస్ Ai బ్రౌజర్ లాంఛ్ చేయగా మైక్రోసాఫ్ట్ తన కోపైలట్ సాఫ్ట్‌వేర్‌ను ఎడ్జ్ బ్రౌజర్‌లో ఇంటిగ్రేట్ చేస్తోంది. కాగా ఇప్పటికే జెమిని Aiని బ్రౌజర్‌లో గూగుల్ చేర్చి సెర్చ్ రిజల్ట్స్ చూపిస్తోంది. కానీ యూజర్లు ఇక్కడే కంటెంట్ పొంది సైట్లకు వెళ్లక యాడ్ రెవెన్యూపై ప్రభావం పడుతోందట. అటు పోటీ ఇటు ఆర్థిక పోట్లతో గూగుల్‌కు డెంట్ తప్పదు అన్పిస్తోంది.