News March 13, 2025

పిఠాపురంలో పవన్ ఫొటో వైరల్

image

పిఠాపురం(చిత్రాడ)లో రేపే జనసేన ఆవిర్భావ సభ జరగనుంది. దీనికి జయకేతనం అని పేరు పెట్టారు. పిఠాపురంలో ఎటు చూసినా జనసేన ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి. పవన్‌ను ఆకట్టుకోవడానికి కొందరు వినూత్నంగా పోస్టర్లు ఏర్పాటు చేశారు. ‘రాయల వారి రాజ్యం.. పవన్ అన్నకే సాధ్యం’ అంటూ పవన్ ఫొటోను ఓ వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలుగా మార్చారు. ఈ ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Similar News

News March 17, 2025

గద్వాల: మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 వరకు బయటకు రావొద్దు: కలెక్టర్

image

వడదెబ్బకు గురి కాకుండా ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సంతోశ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని IDOC భవనంలో వడదెబ్బ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా గోడపత్రికలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇళ్ల నుంచి బయటకు రావొద్దన్నారు. తలపై గుడ్డలు, టోపీలు, రూమాలు ధరించాలన్నారు.

News March 17, 2025

ఎన్టీఆర్ జిల్లాలో 268 మంది విద్యార్థులు గైర్హాజరు

image

ఎన్టీఆర్ జిల్లాలో సోమవారం ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్షలు ప్ర‌శాంతంగా సాగాయి. రిజిస్ట‌ర్ అయిన 27,711 మంది రెగ్యుల‌ర్ విద్యార్థుల‌కు గాను 27,443 మంది హాజ‌ర‌య్యారు. 44 మంది ప్రైవేటు విద్యార్థుల‌కు 39 మంది హాజ‌రైన‌ట్లు డీఈఓ యూవీ సుబ్బారావు తెలిపారు. తాను 11 ప‌రీక్షా కేంద్రాల‌ను త‌నిఖీ చేశామన్నారు. ఎక్క‌డా ఎలాంటి పొర‌పాట్ల‌కు ఆస్కారం లేకుండా అధికారులకు సూచ‌న‌లు చేసినట్లు పేర్కొన్నారు. 

News March 17, 2025

పరీక్ష కేంద్రాల పరిసరాల్లో 163 సెక్షన్ అమలు చేయాలి: BHPL కలెక్టర్

image

పదవ తరగతి విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి వీలుగా రూట్లు వారిగా అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ ఆర్టీసీ సీఎంకు సూచించారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో 163 సెక్షన్ అమలు చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. పరీక్షా కేంద్రాల సమీపంలో ఉన్న అన్ని జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలని సూచించారు.

error: Content is protected !!