News January 25, 2025

పిఠాపురంలో రేపు మాంసం దుకాణాలు బంద్

image

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈనెల 26వ తేదీన పిఠాపురంలోని మాంసం దుకాణాలు మూసివేయాలని పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావు ఆదేశాలిచ్చారు. ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా మాంసాహారం నిషేధించామన్నారు.నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

Similar News

News September 16, 2025

సకాలంలో బాల సంజీవిని కిట్లు అందించాలి: జేసీ

image

బాల సంజీవిని కిట్లను సకాలంలో అంగన్వాడీ కేంద్రాలకు అందేలా పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను జేసీ రాహుల్ ఆదేశించారు. మంగళవారం భీమవరంలో జేసీ ఛాంబర్లో జిల్లా స్థాయి సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రాం మానిటరింగ్ రివ్యూ కమిటీ సమావేశాన్ని సంబంధిత కమిటీ సభ్యులతో నిర్వహించారు. గర్భిణులు, బాలింతలకు ప్రభుత్వం ప్రతినెలా అందిస్తున్న పోషకాహార సరుకులను నాణ్యతతో నిర్ణీత సమయానికి అందజేయాలన్నారు.

News September 16, 2025

ఈనెల 18న వేములవాడ హుండీ లెక్కింపు

image

వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో హుండీ లెక్కింపు ఈనెల 18న ఉదయం 8 గంటలకు జరగనుంది. దేవస్థానం కార్యనిర్వహణాధికారి మంగళవారం ఈ విషయాన్ని తెలిపారు. ఈ లెక్కింపులో భక్తులు సమర్పించిన నోట్లు, నాణేలు, బంగారం, వెండి ఆభరణాలు ఉంటాయని చెప్పారు. అధికారుల సమక్షంలో, లెక్కింపు కమిటీ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు.

News September 16, 2025

ఆదిలాబాద్: డిగ్రీ సెమిస్టర్ ఫలితాలు విడుదల

image

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ ఫలితాలు విడుదలైనట్లు ఆదిలాబాద్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా.జే సంగీత, వర్సిటీ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ జగ్రామ్ పేర్కొన్నారు. 2025 జూలై నెలలో రాసిన డిగ్రీ మొదటి సంవత్సరం రెండవ సెమిస్టర్ ఫలితాలు విడుదలైనట్లు పేర్కొన్నారు. ఫలితాల కోసం ఈ https://braou.ac.in/result#gsc.tab=0 వెబ్ సైట్‌ను సందర్శించాలని సూచించారు.