News March 24, 2025
పిఠాపురం: జనసేన శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపిన పవన్

మార్చి 14న పిఠాపురం, చిత్రాడ వేదికగా అంగరంగ వైభవంగా నిర్వహించిన జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ బహిరంగ సభ జై కేతనం విజయవంతం చేసినందుకు ప్రతిఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలియజేశారు. సభా ప్రాంగణం వద్ద సభ ప్రాంగణం బయట జాతీ రహదారి వెంపటి చేసిన ఏర్పాట్లు అమోఘం ప్రతి ఒక్క జన సైనికుడికి వీర మహిళలకు నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలని పవన్ పేర్కొన్నారు.
Similar News
News December 3, 2025
మోడల్ స్కూల్ ను తనిఖీ చేసిన అడిషనల్ డైరెక్టర్

పాల్వంచ: కిన్నెరసాని మోడల్ క్రీడా పాఠశాలను బుధవారం ట్రైబల్ వెల్ఫేర్ అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్ రెడ్డి అకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల తరగతులు, రికార్డులు, హాస్టల్ నిర్వహణ, భోజన సదుపాయాలు, క్రీడా శిక్షణ వంటి కీలక అంశాలను సమగ్రంగా పరిశీలించారు. 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. బోధన, మెనూ ప్రకారం భోజనం, క్రీడ అభ్యాసం వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. రిజిస్టర్లు, నిర్వహణ పత్రాలు పరిశీలించారు.
News December 3, 2025
T20 వరల్డ్ కప్కి టీమ్ ఇండియా జెర్సీ రిలీజ్

ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026కు సంబంధించిన టీమ్ ఇండియా జెర్సీని బీసీసీఐ రిలీజ్ చేసింది. రాయ్పూర్లో SAతో జరుగుతున్న రెండో వన్డే ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో రోహిత్ శర్మ, తిలక్ వర్మ ఈ జెర్సీలను అన్వెయిల్ చేశారు. ‘టీమ్కు ఎప్పుడూ నా బెస్ట్ విషెస్ ఉంటాయి’ అని రోహిత్ శర్మ పేర్కొన్నారు. 2026 ఫిబ్రవరి 7నుంచి టీ20 వరల్డ్ కప్ ప్రారంభంకానుంది.
News December 3, 2025
టీ20 సిరీస్కు భారత జట్టు ప్రకటన.. గిల్ రీఎంట్రీ

సౌతాఫ్రికాతో ఈ నెల 9 నుంచి జరగనున్న 5 మ్యాచుల టీ20 సిరీస్కు బీసీసీఐ జట్టును ప్రకటించింది. గాయం నుంచి కోలుకున్న గిల్ తిరిగి జట్టులో చోటు సంపాదించారు. ఫిట్నెట్ను బట్టి ఆయన ఆడే అవకాశాలుంటాయని బోర్డు తెలిపింది.
టీమ్: సూర్య కుమార్(కెప్టెన్), గిల్, అభిషేక్, తిలక్, హార్దిక్ పాండ్య, దూబే, అక్షర్, జితేశ్ శర్మ, శాంసన్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్, బుమ్రా, అర్ష్దీప్


