News March 14, 2025
పిఠాపురం: డూప్లికేట్ కాకుండా జనసేన మీడియా పాస్లు

మరికొద్ది గంటలో జనసేన ఆవిర్భావ సభ జరుగనుంది. అయితే కొంతమంది మీడియా ముసుగులో హడావుడి చేస్తున్నారు.ఈ నేపథ్యం పురస్కరించుకుని ఎలాంటి డూప్లికేట్ పాస్లు తయారు చేయకుండా ఉండేందుకు హాలోగ్రామ్తో కూడిన మీడియా పాసులు జారీ చేశారు. అక్రిడేషన్ కార్డులు ఉన్నవారికి మాత్రమే మీడియా పాస్ లిస్టు కలర్ జిరాక్స్ లేదా డూప్లికేట్ తయారు చేయకుండా హాలోగ్రామ్ పెట్టారు. దీనిపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
Similar News
News November 23, 2025
సిరిసిల్లకు అరుదైన గౌరవం

KNR DCC అధ్యక్షుడిగా నియమితులైన చొప్పదండి MLA మేడిపల్లి సత్యం స్వగ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేట. గతంలో గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన కటకం మృత్యుంజయం కరీంనగర్ శాసనసభ్యులుగా ఎన్నికై ఉమ్మడి కరీంనగర్ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. తాజాగా సత్యం KNR DCC అధ్యక్షుడిగా నియమితులు కావడంతో సిరిసిల్ల నియోజకవర్గానికి చెందిన రెండోవ్యక్తిగా పేరు సంపాదించుకున్నారు.
News November 23, 2025
HYD: వీకెండ్ డ్రంక్& డ్రైవ్లో 468 మంది దొరికారు

సైబరాబాద్లో వీకెండ్ డ్రంక్& డ్రైవ్లో 468 మంది పట్టుబడ్డారు. వాహనాల వారీగా 335 టూవీలర్లు, 25 ఆటోలు, 107 కార్లు, 1 హెవీ వెహికల్ సీజ్ చేశారు. మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే ప్రమాదం జరిగితే BNS సెక్షన్ 105 కింద 10 ఏళ్ల జైలు శిక్ష వర్తిస్తుందని పోలీసులు హెచ్చరించారు. గత వారం 681 కేసులు డిస్పోజ్ కాగా.. 613 మందికి ఫైన్, 50 మందికి ఫైన్+ సర్వీస్, 18 మందికి ఫైన్+ జైలు శిక్ష విధించారు.
News November 23, 2025
ఎడారిగా మారిన గుంపుల మానేరు వాగు

ఓదెల మండలం గుంపుల గ్రామంలో మానేరు నదిపై ఉన్న చెక్ డ్యాం కూలిపోవడంతో నది ఎడారిని తలపిస్తోంది. కార్తీక మాసం నవంబర్ 5న వేల సంఖ్యలో భక్తులు పుణ్య స్నానాలకు తరలివచ్చిన మానేరు, కేవలం 15 రోజుల్లోనే నీరు లేక పూర్తిగా ఎండిపోయింది. దీంతో రైతులు, శ్రీ రామభద్ర ఆలయానికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు తక్షణమే చొరవ తీసుకుని చెక్ డ్యాంను పునర్నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.


