News February 9, 2025
పిఠాపురం: పాదగయలో జేడీ లక్ష్మీ నారాయణ పూజలు

పిఠాపురం దక్షిణ కాశీగా పిలవబడే పాదగయ క్షేత్రంలో మాజీ ఐఏఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా కుక్కుటేశ్వర స్వామి వారికి పూజలు నిర్వహించారు. అనంతరం రాజరాజేశ్వరి అమ్మవారు పురుహుతి అమ్మవారి ఆలయాల్లో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయ పండితులు వేద ఆశీర్వచనాన్ని తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ అధికారులు స్వామి వారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు.
Similar News
News February 12, 2026
KNR: ‘నగర’ ఫలితం: లెక్కింపునకు సర్వం సిద్ధం

కరీంనగర్ నగరపాలక సంస్థ 66 డివిజన్ల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు. ఎస్ఆర్ఆర్ కళాశాలలో సిబ్బందికి నిర్వహించిన శిక్షణలో సీపీ గౌస్ ఆలం పాల్గొని దిశానిర్దేశం చేశారు. 300 మంది సిబ్బందితో శుక్రవారం ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం కానుంది. మొత్తం 66 టేబుళ్లు ఏర్పాటు చేయగా, తొలుత పోస్టల్ బ్యాలెట్లు, అనంతరం సాధారణ ఓట్లను లెక్కిస్తారు.
News February 12, 2026
శాతవాహన విశ్వవిద్యాలయం డైరీ ఆవిష్కరణ

శాతవాహన విశ్వవిద్యాలయంలోని పరిపాలన భవనంలో VC యు.ఉమేష్ కుమార్, రిజిస్ట్రార్ పి.సతీష్ కుమార్, ఓఎస్డీ టు వీసీ డా.హరికాంత్, కళాశాలల ప్రిన్సిపల్స్, ఇతర పరిపాలన అధికారులతో కలిసి డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా VC మాట్లాడుతూ.. విశ్వ విద్యాలయాన్ని విస్తరించేందుకు, ఉత్తర తెలంగాణలో మేలైన విద్యను అందించడంలో శాతవాహన విశ్వవిద్యాలయాన్ని ముందు వరుసలో నిలపడానికి ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.
News February 12, 2026
కృష్ణా-వికారాబాద్ రైలు మార్గం.. కేంద్రానికి CM విజ్ఞప్తి

కృష్ణా-వికారాబాద్ రైలు మార్గాన్ని పూర్తిగా కేంద్ర నిధులతో చేపట్టాలని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూ సేకరణ వ్యయాన్ని మొత్తం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. గురువారం ఢిల్లీలో అశ్వినీ వైష్ణవ్తో పార్లమెంట్లోని ఛాంబర్లో భేటీ అయి దీనిపై చర్చించారు.


