News May 16, 2024

పిఠాపురం ప్రజలను ఉద్దేశించి పవన్ లేఖ

image

జనసేన అధ్యక్షులు పవన్ పిఠాపురం ప్రజలను ఉద్దేశించి గురువారం ఓ లేఖ విడుదల చేశారు. ‘ఓటర్లు రాత్రి 10 గంటల వరకూ క్యూలైన్‌లో ఉండి రికార్డ్ స్థాయిలో 86.63 శాతం ఓటింగ్ నమోదు చేయడం మీ ప్రేమను తెలియజేస్తుంది. తాను పోటీ చేస్తానని తెలియగానే ఎంతో బలమైన కేడర్ ఉన్నప్పటికీ సీట్ త్యాగం చేసిన టీడీపీ ఇన్‌ఛార్జి వర్మసహకారం మరువలేనిది. నా కోసం పని చేసిన జనసేన, టీడీపీ, బీజేపీ శ్రేణులకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.

Similar News

News April 23, 2025

రాజమండ్రి: స్పా ముసుగులో వ్యభిచారం

image

రాజమండ్రిలో స్పాముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ స్పా‌ సెంటర్‌పై పోలీసులు దాడులు నిర్వహించారు. SI ఆదినారాయణ వివరాల ప్రకారం.. బ్యూటీషియన్ కోర్సు నేర్పిస్తామని చెప్పి యువతులకు ఎరవేసి వ్యభిచారం నిర్వహిస్తున్నారు. SIకు వచ్చిన సమాచారంతో సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఐదుగురు యువతులు, ఐదుగురు విటులు పట్టుబడ్డారు. స్పా నిర్వాహకుడు మదన్, మేనేజర్ తేజశ్రీని అరెస్టు చేసి కేసు దార్యప్తు చేస్తున్నారు.

News April 22, 2025

తాళ్లపూడి: పుష్కరాల రేవులో శిశువు మృతదేహం లభ్యం

image

తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి పుష్కరాల స్నాన ఘట్టానికి వెళ్లే మార్గంలో ఆడ శిశువు మృతదేహాన్ని మంగళవారం స్థానికులు కనుగొన్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కొవ్వూరు సీఐ విజయబాబు ప్రాంతాన్ని సందర్శించి శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆడ శిశువు మృతదేహం లభ్యమవ్వడంతో చుట్టుపక్కల ప్రైవేట్ ప్రభుత్వ ఆసుపత్రులలో పోలీసులు విచారణ చేపట్టారు.

News April 22, 2025

కొవ్వూరు: ఒకే రోజు ఇద్దరు ఆత్మహత్య

image

కొవ్వూరు మండలంలో ఒకే రోజు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. పట్టణానికి చెందిన వాలిశెట్టి రాంబాబు(54) ఉరివేసుకున్నారు. దొమ్మేరుకి చెందిన వరలక్ష్మి ఈనెల 20న 40మాత్రలు మింగిడంతో అపస్మారక స్థితికి చేరుకున్నారు. ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదులతో రెండు ఘటనలపై పట్టణ పోలీసులు విడివిడిగా కేసులు నమోదు చేశారు.

error: Content is protected !!