News February 28, 2025
పిఠాపురం: యువతి వైద్యానికి పవన్ సాయం

పిఠాపురం మండలం చిత్రాడ గ్రామానికి చెందిన సానా దుర్గా వెంకటలక్ష్మి అనే యువతి కొన్నేళ్లుగా తకయాసు ఆర్థరైటిస్తో బాధపడుతుంది. ఈ వ్యాధికి వైద్యం చేయించుకునేందుకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న విషయం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చింది. పవన్ కళ్యాణ్ తక్షణమే స్పందించి ఆమె వైద్యానికి సీఎంఆర్ఎఫ్ నుంచి రూ.7లక్షల LOC మంజూరు చేయించారు. దీంతో యువతి సోదరునికి స్థానిక నేతలు గురువారం అందజేశారు.
Similar News
News January 11, 2026
మన పల్నాడే పందేం కోళ్లకు అసలైన కేరాఫ్!

కోడి పందేలు అనగానే APలోని ఉభయగోదావరి జిల్లాలు గుర్తుకొస్తాయి. అయితే కోడి పందేలు చరిత్ర శతాబ్దాల వెనక్కి వెళ్లితే ఉమ్మడి గుంటూరు జిల్లా పల్నాటి వీరగాథ ముందుకొస్తుంది. కోడి పందేలే కారణంగా పల్నాడు యుద్ధంలో రక్తపాతం జరిగింది. సామాజిక విభేదాలు, అధికార పోరాటాలు కోడి పందేల చుట్టూ ముదిరి చరిత్రలో చెరగని ముద్ర వేశాయి. సంక్రాంతి సందర్భంగా జిల్లాలో కోడి పందేలు చరిత్రగా, ఒక రకంగా సంప్రదాయంగా ఉన్నాయి.
News January 11, 2026
ఉమ్మడి ఖమ్మం జిల్లాపై ‘దిత్వా’

బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాన్ ప్రభావం ఉమ్మడి ఖమ్మం జిల్లాపై కనిపిస్తోంది. శనివారం ఉదయం నుంచి అక్కడక్కడ చిరుజల్లులు పడుతుండడంతో.. రైతుల్లో భయందోళన మొదలైంది. జిల్లాలో మిర్చి సుమారు 50వేల ఎకరాలపైగా కాతపూత దశలో ఉంది. మొక్కజొన్న లక్షన్నరపైగా ఎకరాల్లో సాగులో ఉంది. వర్షం పడితే మిర్చి, మొక్కజొన్న రైతులు భారీగా నష్టపోయే పరిస్థితి ఉంది. అటు పండుగ సంబురాలకు కూడా వర్షం ఆటంకం కలిగించనుంది.
News January 11, 2026
కృష్ణా: ‘బరి’తెగించిన వసూళ్లు.. ఒక్కో చోట రూ. 20 లక్షల మామూళ్లు!

ఉమ్మడి కృష్ణా జిల్లాలో కోడిపందేల నిర్వహణకు తెర వెనుక భారీగా మామూళ్ల పర్వం సాగుతోంది. బరుల ఏర్పాటు కోసం ప్రజాప్రతినిధుల నుంచి పోలీసు అధికారుల వరకు ఒక్కో బరికి సుమారు రూ. 20 లక్షల వరకు చేతులు మారుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. MLAల అనుచరులే ఈ వ్యవహారాలను చక్కబెడుతున్నారని సమాచారం. భారీగా ముడుపులు చెల్లించడంతో ఈసారి పందేలు ఏ స్థాయిలో జరుగుతాయోనని నిర్వాహకులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.


