News May 25, 2024
పిఠాపురం: రూ.50 నోట్ల ఎర చూపి రూ.6 లక్షల దోపిడి

కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలోని కొండప్ప వీధికి చెందిన ధాన్యం వ్యాపారి నందిపాటి నారాయణమూర్తి శుక్రవారం SBI నుంచి రూ.6 లక్షల నగదు డ్రా చేసి బైక్పై ఇంటికి బయలు దేరారు. సీతయ్యగారితోట వద్దకు వచ్చేసరికి ఇద్దరు వ్యక్తులు వారి వద్ద ఉన్న రూ.50 నోట్లు కింద పడేసి మీ నగదు పడిపోయిందని ఆ వ్యాపారిని నమ్మించారు. ఆయన వద్ద ఉన్న రూ.6 లక్షలు కాజేసి పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News February 8, 2025
రాజానగరం: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రాజానగరం హైవే గైట్ ఇంజినీరింగ్ కాలేజీ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్య మృతి చెందగా.. భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. బొమ్మూరుకి చెందిన వాకలపూడి వెంకటేశ్వరరావు అతని భార్య రాజేశ్వరి(65)తో కలిసి రాజనగరం మండలం పల్లకడియంలో ఉంటున్న కుమార్తె ఇంటికి స్కూటీపై బయలుదేరారు. దీంతో వెనుక నుంచి వస్తున్న లారీ వారిని ఢీకొనడంతో తలకు బలమైన గాయమై రాజేశ్వరి అక్కడికక్కడే మృతి చెందారు.
News February 8, 2025
రాజమండ్రి: పార్కులు థీమ్స్ పార్క్లు అభివృద్ధి చేయాలి- కలెక్టర్

రాజమండ్రిలోని పార్కులను మూస పద్ధతిలో కాకుండా ఒక ప్రత్యేకత కలిగిన థీమ్లతో పర్యాటకులను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి స్పష్టం చేశారు. 2027 పుష్కరాల నాటికి ఆమేరకు పనులు పూర్తి చెయాలని తెలిపారు. శుక్రవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఆమె మాట్లాడారు. నగరంలోని 26 పార్కులను ఆయా పార్కుల అభివృద్ధి ఒక ప్రత్యేకత కలిగి ఉండేలా చూడాలని సూచించారు.
News February 7, 2025
రాజమండ్రి: పార్కులు థీమ్స్ పార్క్లు అభివృద్ధి చేయాలి- కలెక్టర్

రాజమండ్రిలోని పార్కులను మూస పద్ధతిలో కాకుండా ఒక ప్రత్యేకత కలిగిన థీమ్లతో పర్యాటకులను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి స్పష్టం చేశారు. 2027 పుష్కరాల నాటికి ఆమేరకు పనులు పూర్తి చెయాలని తెలిపారు. శుక్రవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఆమె మాట్లాడారు. నగరంలోని 26 పార్కులను ఆయా పార్కుల అభివృద్ధి ఒక ప్రత్యేకత కలిగి ఉండేలా చూడాలని సూచించారు.