News February 25, 2025

పిఠాపురం: వైరల్ అవుతున్న పవన్ AI ఫొటో

image

జిల్లాలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ AI ఫొటో వైరల్‌గా మారింది. జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి పట్టభద్రుల MLC కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్‌కి నిన్న మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆయన ఓ వీడియో ద్వారా తెలిపారు. అయితే ఆయన ఓటును అభ్యర్థిస్తూ AIతో చేసిన ఫొటోను కూటమి నేతలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది. 

Similar News

News February 25, 2025

భువనగిరిలో మహిళా కానిస్టేబుల్ సూసైడ్

image

మహిళా కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడిన ఘటన యాదాద్రి జిల్లాలో జరిగింది. భువనగిరిలో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వరూకొలు గ్రామానికి చెందిన అనూష భువనగిరిలో నివాసం ఉంటున్నారు. తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News February 25, 2025

SLBC ఘటనపై త్వరలో పూర్తి స్థాయి విచారణ: మంత్రి ఉత్తమ్

image

TG: SLBC టన్నెల్‌లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తెచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ ఘటనపై త్వరలో పూర్తి స్థాయి విచారణ జరిపిస్తామన్నారు. అనుకోకుండా జరిగిన ఘటనపై ప్రతిపక్షాలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. కాగా టన్నెల్ 14kms వద్ద ప్రమాదం జరగగా, రెస్క్యూ బృందాలు 13.7kms వరకు చేరుకున్నాయి. సహాయ చర్యలు కొనసాగిస్తున్నాయి.

News February 25, 2025

వికారాబాద్: ‘పది’ పరీక్షలకు పకడ్బందీ చర్యలు: కలెక్టర్

image

జిల్లాలో పదవ తరగతి పరీక్షలను నిర్వహించేందుకు అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో పదవ తరగతి పరీక్షల నిర్వహణపై అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పదవ తరగతి పరీక్షలకు 12,903 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు.

error: Content is protected !!