News June 29, 2024
పిఠాపురానికి పవన్.. తరలనున్న ప.గో జిల్లా నేతలు

డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ జులై 1న తొలిసారి పిఠాపురం రానున్నారు. తనను గెలిపించిన ప్రజలకు అభినందనలు తెలపనున్నారు. ఉప్పాడ సెంటర్లో జరిగే వారాహి సభలో పవన్ ప్రసంగిస్తారు. 3రోజుల పాటు ఆయన పిఠాపురంలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. అటు వారాహి సభకు ఉమ్మడి తూ.గో, ప.గో జిల్లాల నుంచి జనసేన నేతలు, అభిమానులు భారీగా తరలి రానున్నట్లు సమాచారం. ఏర్పాట్లపై కాకినాడ కలెక్టర్ షన్మోహన్ శుక్రవారం సమీక్షించారు.
Similar News
News November 24, 2025
తణుకులో సందడి చేసిన OG హీరోయిన్

సినీ హీరోయిన్ ప్రియాంక మోహన్ సోమవారం తణుకులో సందడి చేశారు. స్వయంభు కపర్ధేశ్వర స్వామి వారిని ఆమె దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆమె వెంట ప్రముఖ జ్యోతిష్యులు డాక్టర్ భమిడి అఖిల్, ఘనపాటి భమిడి సీతారామకృష్ణావధానులు ఉన్నారు.
News November 24, 2025
ప.గో జిల్లాలో 70 మందికి అంగన్వాడీ కార్యకర్తలుగా పదోన్నతి

ప.గో జిల్లాలో పని చేస్తున్న 70 మంది మినీ అంగన్వాడీ కార్యకర్తలను మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలుగా అప్ గ్రేడ్ చేసినట్లు డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే రఘురామ అన్నారు. ఉండి నియోజకవర్గంలో 13 మందికి పదోన్నతి లభించిందన్నారు. సోమవారం పెద అమిరంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఉత్తర్వులను అందించారు. వీరికి వేతనం రూ 7. వేలు – రూ .11,500కి పెరుగుతుందన్నారు.
News November 24, 2025
భీమవరం: 3,000 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల వేదికగా ఈ నెల 29న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్లో గోడపత్రికను ఆమె ఆవిష్కరించారు. ఈ డ్రైవ్లో 28కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయని, సుమారు 3,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని అర్హులైన యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


