News March 19, 2025
పిడుగురాళ్ల: అన్న క్యాంటీన్ను పరిశీలించిన కమిషనర్

పిడుగురాళ్ల పట్టణ పరిధిలో ఉన్నటువంటి అన్న క్యాంటీన్ను మంగళవారం పట్టణ మున్సిపల్ కమిషనర్ శ్రీధర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. క్యాంటీన్ పరిధిలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. భోజనం విషయంలో ఏమైనా సమస్యలు ఉంటే ప్రజలు తమ దృష్టికి తీసుకొని రావాలన్నారు. అనంతరం ప్రజలతో కలిసి క్యాంటీన్లో భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News April 19, 2025
చెరకు రసాన్ని నిల్వ ఉంచి తాగుతున్నారా?

వేసవిలో ఉపశమనం పొందేందుకు చాలా మంది చెరకు రసం తాగుతుంటారు. అయితే కొందరు చెరకు రసాన్ని నిల్వచేసి కొన్ని గంటల తర్వాత
సేవిస్తుంటారు. అలా చేయడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గది ఉష్ణోగ్రత వద్ద స్వచ్ఛమైన చెరకు రసం ఆక్సీకరణం చెందడం 15minలో మొదలవుతుంది. ఈ రసాయనిక చర్యతో 45 ని.ల్లోనే స్వచ్ఛత కోల్పోతుందని చెబుతున్నారు. ఆక్సీకరణం నెమ్మదించాలంటే చెరకు రసంలో కొంచెం నిమ్మరసం లేదా ఐస్ను వాడొచ్చు.
News April 19, 2025
బేగంపేట: యముడు, చిత్రగుప్తుడి అవతారం ఎత్తారు

బేగంపేట చౌరస్తాలో NIPPON ఎక్స్ప్రెస్ CSR కమ్యూనిటీ సర్వీస్లో భాగంగా వాహనదారులకు వినూత్న రీతిలో పోలీసులు యముడు, చిత్రగుప్తుడి వేషధారణలో ట్రాఫిక్ నిబంధనలపై అవేర్నెస్ కల్పించారు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద హెల్మెట్, సీటు బెల్టులేని వారికి వాటి ఆవశ్యకతను వివరించారు. ట్రాఫిక్ ఏసీపీ వెంకటేశ్వర్లు, CI రామచందర్, బోస్కిరణ్, SI భూమేశ్వర్, NIPPON సుధీర్ నాయర్, కలీంఅలీ, అనిల్, ప్రియాంక సుధాకర్ సిబ్బంది ఉన్నారు.
News April 19, 2025
పెద్దపల్లి: PACS కొనుగోలు కేంద్రాలు సిద్ధం

పెద్దపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) ఆధ్వర్యంలో వివిధ గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు సిద్ధమయ్యాయి. పీఏసీఎస్ పరిధిలో 200కు పైగా కొనుగోలు కేంద్రాలకు రైతుల తమ ధాన్యాన్ని తరలిస్తున్నారు. దాదాపు 90% వరి కోతలు పూర్తయ్యాయి. మరో నెల రోజుల్లో కొనుగోళ్ల ప్రక్రియ కూడా పూర్తి కానున్నట్లు అధికారులు తెలిపారు.