News February 13, 2026

పిల్లలకు పాలు అరగాలంటే..!

image

పసిపిల్లలు పాలు తాగిన తర్వాత కచ్చితంగా బర్పింగ్ చేయించాలి. లేదంటే వారు తాగిన పాలను వాంతి చేసుకునే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. పిల్లలను బర్పింగ్ చేయించడంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వారిని సున్నితంగా భుజంపై పెట్టుకొని నెమ్మదిగా వీపును సవరదియ్యాలి. లేదంటే బేబీని ఒళ్లో కూర్చోబెట్టుకొని కాస్త ముందుకు వంచి వీపును సవరదియ్యాలి. ఇలా త్రేన్పులు వచ్చే వరకు చెయ్యాలని చెబుతున్నారు.

Similar News

News March 14, 2026

ఢిల్లీలో కట్టెల పొయ్యిపై నిషేధం ఎత్తివేత

image

గ్యాస్ కొరతతో దేశంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఢిల్లీలో కట్టెల పొయ్యిలపై కేంద్రం నిషేధం ఎత్తివేసింది. దీంతో ప్రజలు వాటితో వంట చేసుకోవడానికి అనుమతి ఇచ్చినట్లయింది. దేశ రాజధానిలో తీవ్ర కాలుష్యం దృష్ట్యా కట్టెల పొయ్యిపై నిషేధం ఉండేది. ఎల్పీజీ సంక్షోభంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు ప్రజలు పానిక్ బయింగ్ చేయొద్దని, సిలిండర్ల కొరత లేదని స్పష్టం చేయడం గమనార్హం.

News March 14, 2026

పవన్ ‘అడవి తల్లి బాట’ వెనుక ప్రత్యేక వ్యూహం!

image

AP: పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని JSP చీఫ్ పవన్ ఇవాళ పాడేరు ఏజెన్సీలో నిర్వహించి ‘అడవితల్లి బాట’ చేపట్టారు. ఆయన కొంతకాలంగా ఏజెన్సీ ప్రాంతాలపై దృష్టిసారించడం వెనుక రాజకీయ వ్యూహం ఉందన్న చర్చ సాగుతోంది. 2019లో 7 ST నియోజకవర్గాలను గెల్చుకొని ఏజెన్సీలో YCP పట్టుబిగించింది. 2024లో కూటమి జోరులోనూ 2సీట్లు గెల్చుకుంది. YCPకి చెక్ పెట్టేలా పవన్ తరచూ గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని విశ్లేషిస్తున్నారు.

News March 14, 2026

రాజీనామాకు సిద్ధమైన జీవన్ రెడ్డి!

image

TG: కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఈ నెల 25న పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. BRS నుంచి వచ్చిన జగిత్యాల MLA సంజయ్‌కి పార్టీ ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆయన పలుమార్లు విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత ఈ వైరం ముదిరింది. దీనిపై జీవన్ రెడ్డి Way2Newsతో మాట్లాడుతూ రాజీనామాకు సిద్ధంగా ఉన్నానన్నారు. తనకు వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాలను అధిష్ఠానానికి వివరించినా లాభం లేదని వాపోయారు.