News May 25, 2024
పిల్లలతో భిక్షాటన.. ఈ నంబర్కు కాల్ చేయండి

చిన్నారులతో భిక్షాటన చేయిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని ప.గో జిల్లా బాలల సంరక్షణ అధికారి ఆర్.రాజేష్ హెచ్చరించారు. ఉమ్మడి జిల్లాలో చాలా చోట్ల ఇలాంటి దందా సాగుతోందని, పట్టుబడితే శిక్షార్హులవుతారని అన్నారు. భీమవరం బస్టాండ్లో శుక్రవారం ఓ బాలుడిని గుర్తించి సంరక్షణ నిమిత్తం ఏలూరు వసతి గృహానికి తరలించినట్లు చెప్పారు. ఇలాంటి చిన్నారులు కనిపిస్తే 1098 నంబర్కు సమాచారం ఇవ్వాలని రాజేష్ కోరారు.
Similar News
News December 19, 2025
తణుకు: లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు

తణుకు జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. పాత టోల్ గేట్ వద్ద యూటర్న్ తీసుకుంటున్న లారీని వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో లారీ బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రమాదం కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. బస్సు అమలాపురం నుంచి విజయవాడ వెళుతున్నట్లు సమాచారం.
News December 19, 2025
ముళ్లపూడి బాపిరాజుకు మరోసారి నిరాశ.?

జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి ఆశించిన ఉమ్మడి ప.గో. జిల్లా మాజీ జెడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజుకి నిరాశే ఎదురైంది. కష్ట కాలంలో పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. టీపీగూడెం నుంచి బాపిరాజు టికెట్టు ఆశించినా.. పొత్తులో భాగంగా ఆ సీటు జనసేనకు కేటాయించారు. కనీసం పార్టీలో నామినేటెడ్ పదవి దక్కుతుందనుకున్న బాపిరాజుకు మరోసారి నిరాశ ఎదురయింది.
News December 19, 2025
ప.గో: బ్యాంకులో రూ. కోట్లు మాయం

ఆకివీడులో ఇటీవల డ్వాక్రా సంఘాల సొమ్మును యానిమేటర్లు రూ. కోట్లలో స్వాహా చేసినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇద్దరు యానిమేటర్లు రూ. 2.36 కోట్లు మాయం చేసినట్లు బ్యాంక్ అధికారులు నిర్ధారించారు.19 డ్వాక్రా సంఘాలలో సుధారాణి రూ.1.39 కోట్లు,13 గ్రూపులకు సంబంధించి హేమలత రూ.96 లక్షల స్వాహా చేసినట్లు అధికారులు తేల్చారు. శుక్రవారం ఆకివీడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామన్నారు.


