News February 3, 2025
పిసినికాడ సమీపంలో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

అనకాపల్లి మండలం పిసినికాడ సమీపంలో హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో బాపూజీ అనే వ్యక్తి మృతి చెందాడు. సోమవారం ఉదయం 10 గంటల సమయంలో బాబుజీ రోడ్డు దాటుతుండగా విశాఖ వైపు వేగంగా వెళుతున్న కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగిన అనంతరం కారు డ్రైవర్ను స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
Similar News
News January 22, 2026
అభిషేక్ రికార్డు

టీమ్ ఇండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ సంచలనం సృష్టించారు. టీ20ల్లో అత్యంత వేగంగా 5వేల పరుగులు పూర్తి చేసిన ప్లేయర్గా నిలిచారు. 2,898 బంతుల్లోనే ఈ మార్కు చేరుకున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో రసెల్(2,942), టిమ్ డేవిడ్(3,127), విల్ జాక్స్(3,196), గ్లెన్ మ్యాక్స్వెల్(3,239) ఉన్నారు. కేవలం అంతర్జాతీయ మ్యాచులే కాకుండా లీగ్స్, డొమెస్టిక్ మ్యాచులు ఇందులోకి వస్తాయి.
News January 22, 2026
నెల్లూరు: ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

జిల్లా న్యాయసేవాధికార సంస్థలో పలు పోస్టుల్లో పని చేసేందుకు అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని జిల్లా జడ్జి జి.శ్రీనివాస్ తెలిపారు. డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫ్రంటాఫీస్ కో-ఆర్డినేటర్ ఒక పోస్ట్, రికార్డు అసిస్టెంట్ నాలుగు పోస్టులు ఉన్నట్లు తెలిపారు. ఆసక్తిగలవారు తమ దరఖాస్తులను ఈ నెల 27లోపు పంపాలని కోరారు. మరిన్ని వివరాలకు కార్యాలయాన్ని పనివేళల్లో సంప్రదించాలని సూచించారు.
News January 22, 2026
VJA: దుస్తులు మార్చుకోవాలన్నా డబ్బులు వసూళ్లు

విజయవాడ దుర్గమ్మ ఆలయానికి తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఆలయ ప్రాంగణంలో స్నానాలు ఆచరించి.. బట్టలు మార్చుకోవాలంటే ఒక్కొక్కరూ రు. 20-25 ఇవ్వాలని అక్కడి సిబ్బంది డిమాండ్ చేస్తున్నారని సమాచారం. కొబ్బరికాయ కొట్టేందుకు రూ.10, పార్కింగ్కి నగదు వసూళ్లు పెరిగాయాని భక్తులు ఆరోపిస్తున్నారు. ఇటు స్నానఘాట్ల వద్ద దుస్తులు మార్చుకునే గదుల శానిటేషన్ పూర్తిగా వదిలేశారని దుయ్యబడుతున్నారు.


