News March 1, 2025

పి.గన్నవరంలో రోడ్డు ప్రమాదం.. డ్రైవర్ మృతి

image

పి.గన్నవరం బ్రిడ్జిపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మామిడికుదురు మండలం ఈదరాడకు చెందిన ట్రక్కు ఆటో డ్రైవర్ ఇంజరపు రామకృష్ణ (37) మృతి చెందాడు. రాజమండ్రి నుంచి ఈదరాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మలికిపురం నుంచి ఆలమూరు వెళ్తున్న ట్రాక్టర్ – ఆటో ఢీ కొనడంతో డ్రైవర్ రామకృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై పి.గన్నవరం ఎస్ఐ శివకృష్ణ కేసు నమోదు చేశామన్నారు.

Similar News

News December 21, 2025

తిమ్మాపూర్: గ్రామీణ మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ

image

ఎల్ఎండి కాలనీలోని ఎస్‌బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో మహిళలకు ఉచిత ఉపాధి శిక్షణకు ధరఖాస్తులను కోరుతున్నట్లు సంస్థ డైరెక్టర్ సంపత్ తెలిపారు. టైలరింగ్ శిక్షణ ఈనెల 30న ప్రారంభిస్తామని, శిక్షణ కాలం 31 రోజులని, శిక్షణ సమయంలో ఉచిత వసతి భోజన సదుపాయాలంటాయని చెప్పారు. 18 -45 ఏళ్ల పదోతరగతి చదివిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన గ్రామీణ మహిళలు అర్హులని పేర్కొన్నారు.

News December 21, 2025

INS సింధుఘోష్‌‌కు వీడ్కోలు

image

‘రోర్ ఆఫ్ ది సీ’గా పేరు పొందిన INS సింధుఘోష్‌ సబ్‌మెరైన్‌కు వెస్టర్న్ నావల్ కమాండ్ నేడు వీడ్కోలు పలికింది. ఇండియన్ నేవీకి 40 ఏళ్లుగా సేవలందిస్తున్న ఈ రష్యన్ బిల్ట్ డీజిల్-ఎలక్ట్రిక్ సబ్‌మెరైన్ యాంటీ షిప్పింగ్, యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్‌లో కీలకభూమిక పోషించింది. నీటిపై 20km/h, సముద్ర గర్భంలో 35km/h వేగంతో ప్రయాణించగలదు. 9M36 Strela-3 ఎయిర్ డిఫెన్స్ మిసైల్ లాంచర్, టార్పెడోలు దీని రక్షణ సామర్థ్యాలు.

News December 21, 2025

చలి గుప్పెట్లో ఉమ్మడి రంగారెడ్డి.. 5.1 డిగ్రీల ఉష్ణోగ్రత

image

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. శనివారం మొయినాబాద్ మండలం రెడ్డిపల్లిలో అత్యల్పంగా 5.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే వికారాబాద్ జిల్లా మోమిన్‌పేటలో 5.8, మౌలాలిలో 7.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో వీస్తున్న చల్లని గాలులకు ప్రజలు గజగజ వణుకుతున్నారు. చలి తీవ్రత దృష్ట్యా వృద్ధులు, చిన్నారులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.