News February 25, 2025
పి.గన్నవరం: ఆటో నుంచి పడి నాలుగేళ్ల బాలుడి మృతి

పి.గన్నవరంలో సోమవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శివకోడు నుంచి వెళ్తున్న గూడ్స్ ఆటో నుంచి పడి ఆదిమూలం వారి పాలానికి చెందిన పవన్ శ్రీనివాస్ (4) మృత్యువాత పడ్డాడు. మార్చి 1న చిన్నాన్న పెళ్లి కోసం హైదరాబాద్ నుంచి వచ్చిన బాలుడు మృత్యుఒడికి చేరడంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. మృతుడి తండ్రి నాగేంద్ర, తల్లి స్వర్ణ చిన్నకొడుకు శ్రీనివాసును హైదరాబాద్ నుంచి స్వగ్రామం పంపగా ఈ ప్రమాదం జరిగింది.
Similar News
News December 4, 2025
మెదక్: తొలి విడతలో 144 గ్రామాల్లో ఎన్నికలు

మెదక్ జిల్లాలో మొదటి విడత ఎన్నికలు జరగనున్న 160 గ్రామ పంచాయతీల్లో 16 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. 1402 వార్డులకు గాను 332 వార్డులు ఏకగ్రీవమైనట్లు పేర్కొన్నారు. 14 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యులు ఏకగ్రీవం అవడంతో ఈరోజు ఉపసర్పంచ్ ఎన్నిక సైతం నిర్వహించినట్లు వివరించారు. మిగిలిన 144 సర్పంచ్, 1072 వార్డులకు 11న ఎన్నికల నిర్వహిస్తున్నట్లు తెలిపారు
News December 4, 2025
తిరుమల: దర్శనాల పేరుతో మోసం చేసిన ఇద్దరు అరెస్ట్

తిరుమల శ్రీవారి దర్శనం కల్పిస్తామని భక్తులను మోసం చేసిన ఇద్దరిని తిరుమల పోలీసులు అరెస్టు చేశారు. ప్రజాప్రతినిధుల పేరుతో నకిలీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ రికమండేషన్ లెటర్లు తయారుచేసి అమాయక భక్తుల నుంచి డబ్బులు దోచుకుంటున్నట్లు వచ్చిన సమాచారంతో పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. నాయుడుపేటకు చెందిన ప్రవీణ్ కుమార్, చెంచు బాలాజీ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
News December 4, 2025
ఏపీ న్యూస్ రౌండప్

* TGలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం(D) నాయకన్గూడెం చెక్పోస్ట్ వద్ద AP CM చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కారు తనిఖీ చేసిన పోలీసులు
* ఈ నెల 11న కడప మేయర్, కళ్యాణదుర్గం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికకు SEC నోటిఫికేషన్ జారీ.. అవినీతి ఆరోపణలతో ఇటీవల కడప మేయర్(YCP)ను తొలగించిన ప్రభుత్వం
* మూడో వన్డే కోసం విశాఖ చేరుకున్న IND, RSA జట్లు.. ఎల్లుండి మ్యాచ్


