News March 29, 2025

పి -ఫోర్ కు జిల్లా నుంచి 500 మంది లబ్ధిదారులు: కలెక్టర్

image

అమరావతిలో ఉగాది రోజున నిర్వహించే ప్రభుత్వ, దాతల, ప్రజల భాగస్వామ్య పథకమైన పి -ఫోర్ కార్యక్రమం పై కలెక్టర్ పి. అరుణ్ బాబు శనివారం సమీక్షించారు. శూన్య పేదరికం లక్ష్యంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి జిల్లా నుంచి 14 బస్సులలో 500 మంది లబ్ధిదారులు హాజరవుతారని తెలిపారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కార్యక్రమం ఉందన్నారు. మౌలిక సదుపాయాలు కల్పించడం లక్ష్యం అని కలెక్టర్ తెలిపారు.

Similar News

News October 18, 2025

TTD ఉద్యోగులకు దీపావళి కానుక

image

తిరుమల తిరుపతి దేవస్థానాల సిబ్బంది సహకార బ్యాంక్ ఆధ్వర్యంలో దీపావళి కానుకగా టీటీడీ ఉద్యోగులకు నాణ్యమైన బ్యాగుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈఓ వెంకయ్య చౌదరి చేతుల మీదుగా ప్రారంభించారు. బ్యాంక్ అధ్యక్షుడు తలారి మహేష్ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం పండుగల సందర్భాల్లో ఉద్యోగులకు ఉపయోగకరమైన బహుమతులు అందించడం తమ సంప్రదాయమని తెలిపారు.

News October 18, 2025

KNR: శాతవాహనలో MBA స్పాట్ అడ్మిషన్స్

image

MBA కోర్సులో 2025-2026 విద్యా సం.కి ప్రవేశాల కోసం అర్హత పొందిన, అర్హత లేని అభ్యర్థులకు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ బిజినెస్ మేనేజ్ మెంట్, శాతవాహన విశ్వవిద్యాలయంలో ఈ నెల 21న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా. బి.హరి కాంత్ తెలిపారు. 12 సీట్లు ఖాళీగా ఉన్నాయని, వివరాలు విశ్వవిద్యాలయం వెబ్ సైట్ లో ఉన్నట్లు తెలిపారు. ఒరిజినల్ సర్టిఫికేట్లు, అవసరమైన ఫీజుతో హాజరుకావాలన్నారు.

News October 18, 2025

CPS అంశాన్ని త్వరలో పరిష్కరిస్తాం: సీఎం

image

AP: *ఈ దీపావళి లోపు RTC ఉద్యోగుల ప్రమోషన్లు క్లియర్ చేస్తాం
*180 రోజుల చైల్డ్ కేర్ లీవ్స్ రిటైర్మెంట్ వరకు ఎప్పుడైనా వాడుకోవచ్చు
*పోలీసులకు EL’s కింద NOVలో రూ.105 కోట్లు, జనవరిలో రూ.105 కోట్లు ఇస్తాం
*నాలుగో తరగతి ఉద్యోగుల గౌరవాన్ని పెంచేలా రీ డెసిగ్నేట్
*CPS అంశంపై చర్చించి త్వరలో పరిష్కరిస్తాం
*ఉద్యోగ సంఘాల భవనాల ప్రాపర్టీ టాక్స్ మాఫీ చేస్తాం