News March 29, 2025

పి -ఫోర్ కు జిల్లా నుంచి 500 మంది లబ్ధిదారులు: కలెక్టర్

image

అమరావతిలో ఉగాది రోజున నిర్వహించే ప్రభుత్వ, దాతల, ప్రజల భాగస్వామ్య పథకమైన పి -ఫోర్ కార్యక్రమం పై కలెక్టర్ పి. అరుణ్ బాబు శనివారం సమీక్షించారు. శూన్య పేదరికం లక్ష్యంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి జిల్లా నుంచి 14 బస్సులలో 500 మంది లబ్ధిదారులు హాజరవుతారని తెలిపారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కార్యక్రమం ఉందన్నారు. మౌలిక సదుపాయాలు కల్పించడం లక్ష్యం అని కలెక్టర్ తెలిపారు.

Similar News

News December 5, 2025

రంప: పాఠశాలలో ఆడుకుంటు..కుప్పకూలిన విద్యార్థిని

image

రంపచోడవరం మండలం తామరపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల‌లో గురువారం విషాద ఘటన చోటు చేసుకుంది. 4వ తరగతి విద్యార్థిని కె. జానుశ్రీ పాఠశాలలో తోటి విద్యార్థులతో ఆడుకుంటుండగా..ఫీట్స్‌ వచ్చి పడి పోయింది. బాలిక పేరెంట్స్, టీచర్స్ హుటాహుటిన రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారరు.

News December 5, 2025

ప్లాస్టిక్‌తో హార్మోన్ల అసమతుల్యత

image

ప్రస్తుతకాలంలో ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఫుడ్స్ ప్యాక్ చేయడానికి ఎక్కువగా వీటినే వాడుతున్నారు. అయితే వీటిల్లో ఉండే బిస్పినాల్‌ ఏ (BPA) రసాయనం ఈస్ట్రోజన్‌, టెస్టోస్టిరాన్‌ సమతుల్యతను దెబ్బతీస్తుందంటున్నారు నిపుణులు. మగవాళ్లలో శుక్ర కణాల సంఖ్య తగ్గడం. ఆడవాళ్లలో PCOS సమస్యలు, టైప్‌ 2 డయాబెటిస్‌, నాడీ వ్యవస్థలో సమస్యలు వస్తాయి. కాబట్టి ప్లాస్టిక్‌కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

News December 5, 2025

సిరిసిల్ల: మానేరు వాగులో గుర్తుతెలియని మృతదేహం

image

సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మానేరు వాగులో గుర్తుతెలియని మృతదేహం శుక్రవారం లభ్యమయింది. అటుగా వెళుతున్న వాహనదారులు మృతదేహాన్ని చూసి ఫొటోలు, వీడియోలు తీసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సమాచారం సేకరిస్తున్నారు. మృతదేహానికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.