News March 7, 2025

పీఎంశ్రీ నిధులను సద్వినియోగం చేసుకోవాలి: క‌లెక్ట‌ర్‌

image

జిల్లాలో పీఎంశ్రీ పథకం ద్వారా ఎంపికైన పాఠశాలలకు మంజూరైన నిధులను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఆనంద్‌ హెచ్‌ఎంలకు సూచించారు. శుక్రవారం మధ్యాహ్నం కలెక్టరేట్‌లో పీఎంశ్రీ నిధుల వినియోగం, పాఠశాలల్లో పెండిరగ్‌లో వున్న అభివృద్ధి పనులపై సమగ్రశిక్ష ఇంజనీర్లు, హెచ్‌ఎంలతో కలెక్టర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు.

Similar News

News March 21, 2025

నెల్లూరు: కేజీబీవీలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

image

నెల్లూరు జిల్లాలోని 12 కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతి, ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సమగ్ర శిక్ష ఏపీసి వెంకటసుబ్బయ్య తెలిపారు. ఆరవ తరగతిలో 40 మందికి, ఇంటర్ ఫస్టియర్‌లో 40 మందికి ఒక్కో విద్యాలయానికి కేటాయించినట్లు తెలిపారు. అలాగే 7,8,9,10 తరగతులతో పాటు ద్వితీయ ఇంటర్‌లో ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు తెలిపారు.

News March 21, 2025

నెల్లూరు: నిరుపేద కుటుంబం.. ఆల్ ఇండియా ర్యాంకు

image

ఉదయగిరి మండలం జి. చెర్లోపల్లి వడ్డిపాలెం గ్రామానికి చెందిన వెంకటయ్య, నరసమ్మ దంపతుల కుమారుడు శేఖర్ ఆల్ ఇండియా లెవెల్‌లో GATE ECE గ్రూపులో 425వ ర్యాంక్ సాధించారు. శేఖర్ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోగా.. తల్లి కూలి పనులకు వెళ్లి శేఖర్‌ని చదివించింది. ఎలాంటి కోచింగ్ లేకుండానే GATE పరీక్ష రాసి తొలిప్రయత్నంలోనే జాతీయస్థాయి ర్యాంకు సాధించాడు. IITలో M.Tech చేసి మంచి జాబ్ సాధించడమే లక్ష్యమని శేఖర్ అన్నారు.

News March 21, 2025

నెల్లూరు: ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలకు నోటిఫికేషన్

image

నెల్లూరు జిల్లాలో ఖాళీ అయిన విడవలూరు ఎంపీపీ, దగదర్తి వైస్ ఎంపీపీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ZP సీఈవో విద్యారమ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎన్నికకు సంబంధించి ముందస్తుగా ఈ నెల 23వ తేదీలోగా సభ్యులకు నోటీసులు జారీ చేయాలని సూచించారు. ఈనెల 27వ తేదీ ఉదయం 11 గంటలకు ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నిక నిర్వహించాలని సూచించారు. ఈ మేరకు ఆయా మండలాల ఎంపీడీవోలకు ఆదేశాలు జారీచేశామన్నారు.

error: Content is protected !!