News February 14, 2025

పీఎంశ్రీ నిధుల వినియోగంపై సమీక్ష

image

జనగామ జిల్లా కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పీఎం శ్రీ సమగ్ర శిక్ష పథకాల అమలు తీరుపై హైదరాబాద్ నుంచి పాఠశాల విద్యా డైరెక్టర్ నర్సింహారెడ్డితో కలిసి రాష్ట్ర విద్యా శాఖ సెక్రెటరీ యోగిత రాణా కలెక్టర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలో పీఎంశ్రీ కింద ఎంపిక చేయబడిన 15 పాఠశాలల్లో వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం విడుదల చేయబడిన నిధులు, వాటి వినియోగంపై పలు సూచనలు చేశారు.

Similar News

News October 22, 2025

నాగులచవితికి విశాఖ జూ పార్కు వేళల్లో మార్పు!

image

నాగులచవితి పండగ సందర్భంగా విశాఖలోని ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్ వేళల్లో మార్పులు చేశారు. శనివారం రోజు సందర్శకుల కోసం పార్కును సాధారణ సమయం కంటే ముందుగా ఉదయం 7:30 గంటలకే తెరవనున్నట్లు క్యూరేటర్ మంగమ్మ ప్రకటించారు. జూ లోపల పటాకులు, పేలుడు పదార్థాలు వంటి నిషేధిత వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

News October 22, 2025

బకాయిలు అడిగితే బ్లాక్‌మెయిల్ చేస్తారా.. ప్రభుత్వంపై బండి ఫైర్

image

TG: ఫీజు బకాయిలు అడిగిన విద్యాసంస్థలను విజిలెన్స్ దాడులతో బ్లాక్‌మెయిల్ చేస్తారా అని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రభుత్వాన్ని నిలదీశారు. బిహార్ ఎన్నికలకు ఇక్కడి నుంచి డబ్బులు పంపే సర్కార్.. విద్యార్థుల భవిష్యత్తు కోసం బకాయిలు చెల్లించలేదా అని ప్రశ్నించారు. తక్షణమే బకాయిలు విడుదల చేయకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడొద్దని, అండగా ఉంటామని విద్యాసంస్థలకు భరోసా ఇచ్చారు.

News October 22, 2025

మనుబోలు: హైవేపై ప్రమాదం.. ఒకరి స్పాట్ డెడ్

image

మనుబోలు మండలం కాగితాల పూర్ క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై బొలెరో, బైక్ ఢీకొనడంతో బుధవారం అక్కడికక్కడే మహిళ మృతి చెందింది. గొట్లపాలెం నుంచి కాగితాల పూర్‌కు బైకుపై హైవే క్రాస్ చేస్తుండగా బొలెరో ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెళ్తున్న కాగితాల పూర్‌కి చెందిన కొండూరు సుప్రజ(40) మృతిచెందగా, కొడుకు రాకేష్ గాయపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.