News September 25, 2024
పీఎం సూర్యఘర్ ముఫ్తి బిజిలి యోజన పథకం అమలుపై కలెక్టర్ సమీక్ష

పీఎం సూర్యఘర్ ముఫ్తి బిజిలి యోజన పథకం అమలుపై అధికారులతో జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ సమీక్షించారు. ఈ పథకం గృహ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుందని దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు సంబంధిత అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు www.pmsuryaghar.gov.in లో రిజిస్టర్ చేసుకొని ప్రభుత్వ రాయతీ పొందాలన్నారు.
Similar News
News October 18, 2025
రూ.1కే సిమ్.. రోజుకు 2.5 జీబీ హై స్పీడ్ డేటా

BSNL కొత్త వినియోగదారులకు దీపావళి సందర్భంగా కానుక ప్రకటించినట్లు నెల్లూరు జిల్లా జనరల్ మేనేజర్ అమరేందర్ రెడ్డి తెలిపారు. ఈ ప్యాకేజీలో రూ.1కే సిమ్ అందిస్తూ అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 2.5 జీబీ హై స్పీడ్ డేటా, 100 ఎస్ఎంఎస్లు ఉపయోగించుకోవచ్చన్నారు. ఈ సిమ్ కోసం ఆధార్ ధ్రువీకరణతో బీఎస్ఎన్ఎల్ కార్యాలయం కానీ ఏజెంట్ల ద్వారా ఈ అవకాశం నవంబర్ 15 వరకు పొందవచ్చు అన్నారు.
News October 18, 2025
పవన్ కళ్యాణ్ వద్దకు చేరిన నెల్లూరు పంచాయితీ

జిల్లా పర్యవేక్షకులు అజయ్ కుమార్ తీరుపై జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జులు పలు విమర్శలు చేశారు. దీంతో డైరెక్ట్గా DCM పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. నెల్లూరు జిల్లాకు చెందిన అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జులను శనివారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి రావాలని సందేశాలు పంపారు. దీంతో నెల్లూరు జిల్లాలో రెండు రోజుల క్రితం తిరుగుబాటు జెండా ఎగురవేసిన జనసేన నేతలందరూ శుక్రవారం విజయవాడ బయలుదేరారు.
News October 17, 2025
నెల్లూరులో ఆక్రమణలపై కొరడా..!

ఇటీవల NMC అధికారులు రోడ్డు మార్జిన్లపై కొరాడ జలిపిస్తున్నారు. ప్రధానంగా నెల్లూరులో సైడు కాలువలపై ఆక్రమణలు పెరిగిపోయాయి. ప్రధాన ట్రంకురోడ్డు, పొదలకూరు రోడ్డు, రంగనాయకులపేట, సంతపేట, గాంధీ బొమ్మ, కనకమహాల్ ఇలా ప్రధానమైన చోట్ల కాలువలను ఆక్రమించేశారు. ఫలితంగా గతంలో ఎన్నడూ లేనంతగా కార్పొరేషన్ ఆక్రమనలను తొలగిస్తున్నారు. ఇప్పటికే పలుచోట్లా అక్రమణలను ధ్వంసం చేస్తున్నారు.