News February 21, 2025
పీఎం సూర్యఘర్ లక్ష్యాలపై దృష్టిపెట్టండి: కలెక్టర్

పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద రిజిస్ట్రేషన్లతో పాటు సౌర ఫలకాల ఏర్పాటుపై ప్రతి మండలానికి నిర్దేశించిన లక్ష్యాలపై అధికారులు దృష్టిసారించాలని కలెక్టర్ లక్ష్మీశ స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్లో పీఎం సూర్యఘర్ పథకంపై కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఇప్పటి వరకు జరిగిన రిజిస్ట్రేషన్లతో పాటు ఇన్స్టలేషన్స్పై చర్చించారు.
Similar News
News December 10, 2025
గ్లోబల్ సమ్మిట్: ఆ విద్యార్థులకే అనుమతి

TG: గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్ల సందర్శనకు ప్రత్యేకంగా ఎంపిక చేసిన కొన్ని రెసిడెన్షియల్ స్కూళ్ల విద్యార్థులనే ఇవాళ అనుమతిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఆ పాఠశాలలను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఎంపిక చేస్తారని చెప్పింది. 2PM నుంచి 7PM వరకు అనుమతిస్తున్నట్లు పేర్కొంది. గురువారం నుంచి మిగిలిన రోజుల్లో ఎవరెవరికి ప్రవేశం ఉంటుందనే విషయాన్ని నేడు ప్రకటిస్తామని వెల్లడించింది.
News December 10, 2025
VZM: ‘గ్రామీణ రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి రూ.84.62 కోట్లు మంజూరు’

జిల్లాలో గ్రామీణ రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి రూ.84.62 కోట్లు మంజూరయ్యాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. మొత్తం 67 పనులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేసిందన్నారు. బొబ్బిలి-8, చీపురుపల్లి-10, గజపతినగరం-7, నెల్లిమర్ల-17, రాజాం-6, ఎస్.కోట-7, విజయనగరం-12 పనులకు ఆమోదం లభించిందన్నారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో ఈ అనుమతులు వచ్చినట్లు వెల్లడించారు.
News December 10, 2025
తిరుమల: కల్తీ గురించి ఎవరికి చెప్పారు..?

తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్ కస్టడీలో తొలి రోజు అధికారులు అడిగిన ప్రశ్నలకు ఏ-16 అజయ్ కుమార్ సుగంధ్, ఏ-29 సుబ్రహ్మణ్యం పలు సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. నెయ్యికి కెమికల్స్ సరఫరా చేస్తున్నట్లు తెలిసే చేశారా? దీని గురించి ఎవరెవరితో మాట్లాడారు? అసలు కల్తీ అని గుర్తించి టీటీడీ అధికారులకు చెప్పారా లేదా అంటూ ప్రశ్నించారు. సాయంత్రం తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్కు తరలించారు.


