News July 8, 2024

పీఏబీఆర్‌లో పడిపోయిన నీటిమట్టం

image

కూడేరు మండల పరిధిలోని పెన్నాహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్) డ్యాంలో నీటిమట్టం పడిపోయిందని అధికారులు తెలిపారు. ఆదివారం నాటికి డ్యామ్‌లో 0.588 టీఎంసీల నీరు ఉన్నట్లు డ్యాం అధికారులు వెల్లడించారు. జలాశయం వద్ద ఏర్పాటైన శ్రీరామారెడ్డి, సత్యసాయి, అనంతపురం, ఉరవకొండ, కూడేరు తాగునీటి ప్రాజెక్టులకు రోజు సుమారు 60 క్యూసెక్కుల వరకు నీటిని విడుదల చేస్తున్నామన్నారు.

Similar News

News October 20, 2025

ప్రభుత్వం డీఏ జీఓను సవరించాలి: విజయ్

image

ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు కరవు భత్యాన్ని మంజూరు చేస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ జారీచేసిన 60, 61 జీఓలు అసంబద్ధంగా ఉంటూ ఉద్యోగికి తీవ్ర నష్టం కలిగించేలా ఉన్నాయని, వెంటనే జీవోలను సవరించాలని ఏపీఎస్ఈఏ రాష్ట్ర అధ్యక్షుడు నల్లపల్లి విజయ్ భాస్కర్ డిమాండ్ చేశారు. సోమవారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. డీఏ అరియర్స్ పదవీ విరమణ తర్వాత చెల్లిస్తామని అనడం సరైనది కాదన్నారు.

News October 20, 2025

వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా రాధ

image

గుత్తి ఆర్ఎస్‌లోని ఎస్ఎస్ పల్లికి చెందిన చంద్రగిరి రాధను వైసీపీ మహిళా విభాగం అనంతపురం జిల్లా ఉపాధ్యక్షురాలిగా నియమించారు. ఈ మేరకు ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. రాధ ఎంపిక పట్ల వైసీపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని రాధ అన్నారు.

News October 19, 2025

పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించండి: ఎస్పీ

image

అనంతపురం జిల్లా ప్రజలకు, జిల్లా పోలీసు సిబ్బందికి ఎస్పీ జగదీశ్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి మీ జీవితాలలో చీకట్లను పారదోలి మరిన్ని కాంతులు నింపాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకునే ఈ దీపావళి పర్వదినాన ఆనవాయితీగా వచ్చే బాణసంచాను సరైన జాగ్రత్తలతో కాల్చాలని సూచించారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు.