News September 9, 2024
పీజీఆర్ఎస్ రద్దు: ఎస్పీ

నంద్యాల ఎస్పీ కార్యాలయంలో నేడు జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనివార్య కారణాల వల్ల రద్దు చేసినట్లు ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు. ఎస్పీ కార్యాలయానికి సమస్యల కోసం వచ్చే ప్రజలు రావద్దని ఆయన సూచించారు. సుదూర ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసలతో ప్రజలు తమ సమస్యలను వస్తారని ఈ విషయాన్ని గమనించి ఎవరూ రావద్దని ఆయన సూచించారు.
Similar News
News January 4, 2026
శ్రీ రాఘవేంద్ర స్వామి సన్నిధిలో సినీ డైరెక్టర్

మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని సినిమా డైరెక్టర్ తేజ, టీడీపీ కర్నూలు జిల్లా మాజీ అధ్యక్షుడు తిక్క రెడ్డి ఆదివారం దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. మంచాలమ్మ దేవి, మూల బృందావనాన్ని దర్శించుకుని, మొక్కులు తీర్చుకున్నారు. అర్చకులు తీర్థప్రసాదాలు ఇచ్చి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో శ్రీమఠం అధికారులు నరసింహమూర్తి, వ్యాసరాజస్వామి, పన్నగ వెంకటస్వామి పాల్గొన్నారు.
News January 4, 2026
రేవంత్ వ్యాఖ్యలపై చంద్రబాబు సమాధానం చెప్పాలి: ఎస్వీ

రాయలసీమలో ఎత్తిపోతల పథకాలను చంద్రబాబుతో కలిసి నిలిపేశామని అసెంబ్లీలో రేవంత్ చేసిన వ్యాఖ్యలకు సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఎస్వీ కాంప్లెక్స్లో మీడియాతో ఆయన మాట్లాడారు. ఓటుకు నోటులో కేసీఆర్కు భయపడి చంద్రబాబు ప్రాజెక్టులను పట్టించుకోలేదన్నారు. సీమకు జరుగుతున్న అన్యాయంపై సీమ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు నోరు విప్పాలన్నారు.
News January 4, 2026
కర్నూలు కాంగ్రెస్ పార్టీ కొత్త బాస్ ఈయనే..!

కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడిగా పత్తికొండ నియోజకవర్గ కోఆర్డినేటర్ క్రాంతి నాయుడు నియమితులయ్యారు. ఏపీలోని జిల్లా డీసీసీల అధ్యక్షుల నియామకాలకు ఏఐసీసీ అధ్యక్షుడు ఆమోదం తెలిపినట్లు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా చేపట్టిన సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈ నియామకాలు చేసినట్లు తెలిపారు.


