News October 21, 2024

పీయూలో బాస్కెట్‌బాల్, క్రికెట్ క్రీడాకారుల ఎంపికలు

image

ఈనెల 23న పాలమూరు యూనివర్సిటీలో పురుషుల  బాస్కెట్‌బాల్, 25న స్త్రీ, పురుషు క్రికెట్ క్రీడారులను ఎంపిక చేయనున్నట్లు పీయూ PD శ్రీనివాసులు సోమవారం తెలిపారు. యూనివర్సిటీ పరిధిలోని అన్ని కళాశాలల విద్యార్థులు పాల్గొన వచ్చన్నారు. 17-25 ఏళ్ల వయసు ఉండి, చదువుతున్న కళాశాల బోనోఫైడ్ తీసుకురావాలన్నారు. బ్యాట్మింటన్, టైక్వాండో 18,19 టైక్వాండో స్త్రీ, పురుషులు స్త్రీ, పురుషులు కబడ్డీ-21న ఎంపిక చేస్తామన్నారు.

Similar News

News November 15, 2025

MBNR: రోడ్డు ప్రమాదంలో మహిళా కూలీ దుర్మరణం

image

అడ్డాకుల మండలం రాచాల సమీపంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళా కూలీ మృతిచెందింది. స్థానికులు తెలిపిన వివరాలు.. చౌడాయపల్లికి చెందిన మహిళా కూలీలు ఆటోలో వస్తుండగా, ఎదురుగా వచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న కూలీ పద్మ(30) అక్కడికక్కడే మృతిచెందగా.. మరో మహిళ బురమ్మకు స్వల్ప గాయాలయ్యాయి. బైక్ నడుపుతున్న వినయ్‌కు తీవ్ర గాయాలు కాగా, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

News November 15, 2025

ఉష్ణోగ్రతలు పడిపోయాయి.. MBNRలో ఇదీ పరిస్థితి..!

image

MBNR జిల్లాలో ఐదు రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. అత్యల్పంగా బాలానగర్ మండల కేంద్రంలో 10.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాజాపూర్‌లో 11.1, గండీడ్ మండలం సల్కర్‌పేటలో 11.3, మిడ్జిల్‌లో 12.3, కోయిలకొండ సిరివెంకటాపుర్, భూత్‌పూర్‌లో 12.7, మహ్మదాబాద్‌లో 13.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

News November 14, 2025

కురుమూర్తి స్వామి ఆలయంలో కోడెల వేలం

image

శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థానం 2025 బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు సమర్పించిన 18 కోడెదూడల వేలంపాట నిర్వహించారు. ఈ వేలం ద్వారా ఆలయానికి రూ.1,17,000 ఆదాయం లభించింది. ఈ విషయాన్ని ఆలయ పాలకమండలి ఛైర్మన్ జి. గోవర్ధన్ రెడ్డి, ఈవో మదనేశ్వర్ రెడ్డి తెలిపారు. సభ్యులు భాస్కరాచారి, కమలాకర్ పాల్గొన్నారు.