News October 19, 2024

పీసీసీ అధ్యక్షులు రేవంత్ ఇచ్చిన స్క్రిప్టు చదువుతున్నారు: కొప్పుల

image

ఉద్యోగాల నియామకాల విషయంలో పీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. కేసీఆర్ పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారన్న వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 50వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు సీఎం, మంత్రులు గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వమే ఆ నోటిఫికేషన్లను విడుదల చేసిందన్నారు.

Similar News

News November 17, 2025

WJI జిల్లా ప్రధాన కార్యదర్శిగా గుడాల శ్రీనివాస్

image

వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా(WJI) జిల్లా ప్రధాన కార్యదర్శిగా గన్నేరువరం మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు, రిపోర్టర్ గుడాల శ్రీనివాస్ నియమితులయ్యారు. ఆదివారం జిల్లా కేంద్రంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర కమిటీ సూచనల మేరకు ఆయనను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ, జర్నలిస్టుల సంక్షేమం, సంఘం బలోపేతం కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు.

News November 17, 2025

జమ్మికుంటలో పత్తి కొనుగోళ్లు బంద్

image

CCI L- 1, L- 2 విధానాలు, స్లాట్ బుకింగ్ వల్ల రైతులు, జిన్నింగ్ మిల్లులు ఇబ్బందులు పడుతున్నాయని జమ్మికుంట మార్కెట్ కమిటీ తెలిపింది. వినతులు ఇచ్చినా చర్యలు లేకపోవడంతో జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ పిలుపుమేరకు నేటి నుంచి జమ్మికుంటలో CCI, ప్రైవేట్ కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. రైతులు పత్తిని మార్కెట్‌ యార్డు, మిల్లులకు తీసుకురావద్దని, ‘కపాస్ కిసాన్’లో స్లాట్ బుక్ చేయవద్దని సూచించారు.

News November 16, 2025

కరీంనగర్: ఈ మండలాల్లో రిపోర్టర్లు కావలెను..!

image

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి, వీణవంక, జమ్మికుంట, మానకొండూరు, తిమ్మాపూర్ మండలాల నుంచి రిపోర్టర్ల కోసం Way2News దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వారు మాత్రమే ఈ లింకుపై <>క్లిక్<<>> చేసి వివరాలు నమోదు చేయండి.