News August 19, 2024
పుంగనూరు: ఆస్పత్రిలో డెంగ్యూ బాధితులు

ఇద్దరు విద్యార్థులకు డెంగ్యూ జ్వరం సోకి పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మండలంలోని రాంపల్లెకు చెందిన బార్గవ్(13) 10వ తరగతి చదువుతున్నారు. జ్వరం రావడంతో ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించగా డెంగ్యూ అని నిర్ధారణ అయింది. అలాగే, పలమనేరు మండిపేటకోటూరుకు చెందిన మూడో తరగతి విద్యార్థిని మోక్షిత(9) కూడా డెంగ్యూ జ్వరంతో పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
Similar News
News October 30, 2025
తుఫాన్ను సీఎం అద్భుతంగా ఎదుర్కొన్నారు: MP

చిత్తూరు: మొంథా తుఫాన్ను సీఎం చంద్రబాబు అపార అనుభవంతో అద్భుతంగా ఎదుర్కొన్నారని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు కొనియాడారు. ముందస్తు చర్యలతో ప్రాణనష్టం నివారించగలిగామని తెలిపారు. బాధితులకు సహాయం, పునరావాస కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించడం సీఎం చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ప్రజలకు అండగా నిలిచిన ప్రజాప్రతినిధులు, అధికారులను ఆయన అభినందించారు.
News October 30, 2025
చిత్తూరు కలెక్టర్ కీలక ఆదేశాలు

చిత్తూరు జిల్లాలో తుఫాను నష్టంపై నవంబర్ 5వ తేదీ లోపు నివేదికలు సిద్ధం చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. నష్ట గణన ప్రక్రియపై బుధవారం సాయంత్రం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని అధికారులతో సమీక్షించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో నివేదికలు తయారు చేయాలని సూచించారు. నష్టాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి నిధుల మంజూరుకు కృషి చేస్తామన్నారు.
News October 30, 2025
చిత్తూరు కలెక్టర్ కీలక ఆదేశాలు

చిత్తూరు జిల్లాలో తుఫాను నష్టంపై నవంబర్ 5వ తేదీ లోపు నివేదికలు సిద్ధం చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. నష్ట గణన ప్రక్రియపై బుధవారం సాయంత్రం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని అధికారులతో సమీక్షించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో నివేదికలు తయారు చేయాలని సూచించారు. నష్టాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి నిధుల మంజూరుకు కృషి చేస్తామన్నారు.


