News August 15, 2024

పుంగనూరు :ఒక్కసారిగా పూల ధరలకు రెక్కలు

image

శ్రావణ మాసం, అందులోనూ రెండో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం రాకతో పూల ధరలు అదరహో అనిపిస్తున్నాయి. శ్రావణమాసం ముందు వారం అంతంత మాత్రంగా ఉన్న పూల ధరలు ఒక్కసారిగా రెండు నుంచి మూడింతలు పెరిగాయి. బంతిపూలు కిలో ధర రూ.10 నుంచి రూ.50కి చేరింది. 300 ఉన్న మల్లెపూలు రూ.1000 చేరాయి. కనకాంబరాలు 600 నుండి ప్రస్తుతం రూ.2000 చేరింది అయితే ఇది హోల్‌సేల్‌ ధరలు మాత్రమే. రిటైల్‌కు వచ్చే సరికి పూల ధర రెట్టింపు అవుతాయి.

Similar News

News October 16, 2025

తోతాపురం సబ్సిడి పడలేదా.. ఇలా చేయండి.!

image

తోతాపూరి మామిడి రైతులకు అందించిన సబ్సిడీపై సందేహాలు ఉంటే టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని
చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. తమ సందేహాలను 08572-242777 నంబర్ ద్వారా తెలుసుకోవచ్చాన్నారు. అర్హత ఉన్నా నగదు జమకాని రైతులు రైతు సేవా కేంద్రాలు, హార్టికల్చర్ కార్యాలయాలలో ఈనెల 30లోపు వినతి పత్రాలు అందజేయాలన్నారు. రెండు రోజుల్లో వాటిని పరిష్కరిస్తామన్నారు.

News October 16, 2025

ఏమాత్రం క్రేజ్ తగ్గని రాగి సంగటి, నాటుకోడి కూర.!

image

ప్రాచీన కాలంగా చిత్తూరుతోసహా సీమవాసుల ఆహారంలో రాగి సంగటి, నాటు కోడి పులుసు భాగమైంది. గతంలో పండుగలు, శుభకార్యాల సమయంలో దీనికి గ్రామాలలో అధిక ప్రాధాన్యం ఉండేది. ఇప్పుడు కూడా దాని క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. రాగులు, బియ్యంతో వండే సంగటి, నాటుకోడి ముక్కలతో ప్రత్యేకంగా తయారు చేసే పులుసు భోజన ప్రియులు ఎంతో ఇష్టంగా ఆరగిస్తారు. పలు హోటల్లలోను ఇది స్పెషల్ మెనూగా ఉంటుంది.
# నేడు ప్రపంచ ఆహార దినోత్సవం.

News October 16, 2025

చిత్తూరు జిల్లాలో సోషల్ ఆడిట్ పూర్తి

image

చిత్తూరు జిల్లాలో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన సామాజిక తనిఖీ ప్రజావేదిక సోషల్ ఆడిట్ పూర్తయింది. 58 పాఠశాలలు తనిఖీ చేసి ఆడిట్ రిపోర్ట్ అందజేశారు. కన్నన్ కళాశాలలో జరిగిన హెచ్ఎంల సమావేశంలో ఆడిట్ రిపోర్ట్ అందజేశారు. ఆడిట్ రిపోర్టును 11 మంది రిసోర్స్ పర్సన్స్ పరిశీలించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకం, పాఠశాల రికార్డులు తనిఖీ చేశారు. సమగ్ర శిక్ష ఏవో నాగరాజు సిబ్బంది పాల్గొన్నారు.