News August 15, 2024
పుంగనూరు :ఒక్కసారిగా పూల ధరలకు రెక్కలు

శ్రావణ మాసం, అందులోనూ రెండో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం రాకతో పూల ధరలు అదరహో అనిపిస్తున్నాయి. శ్రావణమాసం ముందు వారం అంతంత మాత్రంగా ఉన్న పూల ధరలు ఒక్కసారిగా రెండు నుంచి మూడింతలు పెరిగాయి. బంతిపూలు కిలో ధర రూ.10 నుంచి రూ.50కి చేరింది. 300 ఉన్న మల్లెపూలు రూ.1000 చేరాయి. కనకాంబరాలు 600 నుండి ప్రస్తుతం రూ.2000 చేరింది అయితే ఇది హోల్సేల్ ధరలు మాత్రమే. రిటైల్కు వచ్చే సరికి పూల ధర రెట్టింపు అవుతాయి.
Similar News
News February 28, 2026
చిత్తూరు పోలీసులకు అవార్డులు

ఉత్తమ సేవలు అందించిన పోలీస్ అధికారులు, సిబ్బందికి 2025 సంవత్సరానికిగాను అతి ఉత్కృష్ట, ఉత్కృష్ట సేవా అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. చిత్తూరు అడ్మిన్ ఎస్పీ రాజశేఖర్ రాజు, ఏఆర్ ఎస్ఐ రవి, చిత్తూరు వన్ టౌన్ హెడ్ కానిస్టేబుల్ నాగరాజు, పలమనేరు అర్బన్ హెడ్ కానిస్టేబుల్ లీలాసుఖ నాయుడు, చిత్తూరు ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ గోవిందరాజులు, రాళ్లబూదుగూరు హెడ్ కానిస్టేబుల్ పరమేష్ తదితరులు ఉన్నారు.
News February 27, 2026
CTR: రూ.కోట్లు కొల్లగొట్టి.. ప్రజలకు కుచ్చుటోపి పెట్టి!

చీటీల పేరుతో మోసాలు విపరీతంగా పెరిగి పోతున్నాయి. మొన్న పలమనేరులో ఓ ఘటన వెలుగు చూడగా, నేడు పూతలపట్టులో అనధికార చీటీ నిర్వాహకుడు పరారైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ.2-3 కోట్ల మేర చీటీ డబ్బులతో ఓ వ్యాపారి ఉడాయించినట్లు సమాచారం. కుటుంబ సభ్యులతో సహా అందుబాటులో ఉండకపోవడం, చీటీ కార్యాలయాన్ని మూసివేయడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
News February 27, 2026
చిత్తూరు: ‘తక్షణమే రైతులకు డ్రిప్ పరికరాలు ఇవ్వాలి’

కలెక్టర్ సుమిత్ కుమార్ శుక్రవారం మైక్రో ఇరిగేషన్పై సమీక్ష నిర్వహించారు. అర్హత కలిగిన రైతులందరికీ తక్షణమే సర్వే పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. రైతు వాటా చెల్లించిన వారికి వెంటనే మైక్రో ఇరిగేషన్ పరికరాలు అందజేయాలని ఆయన సూచించారు. డ్రిప్ పరికరాలు మంజూరైన 1386 మందికి మెటీరియల్ పంపిణీ చేయాలన్నారు. మెటీరియల్ అందుకున్న రైతులకు ఇన్స్టాలేషన్ చేయాలన్నారు.


