News October 7, 2024
పుంగనూరు: క్వారీలో భారీ పేలుడు.. ముగ్గురి పరిస్థితి విషమం
చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గం మేళం దొడ్డి సమీపంలో ఉన్న మేకనజామనపల్లి క్వారీలో సోమవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో అక్కడ ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడ్డవారిని వెంటనే పుంగనూరు, మదనపల్లెకు తరలించారు. కాగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడ్డ వారి వివరాలు, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 8, 2024
చిత్తూరు: ఉచిత ఇసుక విధానం అమలు : కలెక్టర్
జిల్లాలో పకడ్బందీగా ఉచిత ఇసుక విధానం అమలు జరుగుతుందని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. సోమవారం సచివాలయంలో కలెక్టర్, ఎస్ పి మణికంఠ చందోలుతో కలిసి ఇసుక విధానంపై సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. తక్కువ ధరకు ఇసుకను ప్రజలకు అందించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. https://sand.ap.gov.in/ ఇసుక కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
News October 7, 2024
మదనపల్లె: స్వర్ణకుమారిది హత్యే .. పోలీసుల అదుపులో వెంకటేశ్
మదనపల్లె జగన్ కాలనీలో గత నెల 9న అదృశ్యమైన స్వర్ణకుమారిని హత్యచేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నిందితుడు వెంకటేశ్ను సోమవారం కర్ణాటకలో పోలీసులు పట్టుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారంతో ఆమెను పథకం ప్రకారం హత్యచేసి, 2టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పాతిపెట్టినట్లు తెలుసుకున్నారు. మంగళవారం DSP, MROల సమక్షంలో హత్య కేసు వివరాలు, వెంకటేశ్ అరెస్టు మీడియాకు బహిర్గతం చేయనున్నారు.
News October 7, 2024
తిరుమల శ్రీవారికి చెన్నై గొడుగులు
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవనాడు స్వామివారికి అలంకరించేందుకు హిందూ ధర్మార్థ సమితి చెన్నై నుంచి తొమ్మిది గొడుగులు, రెండు పెరుమాళ్ నామాలను ఊరేగింపుగా సోమవారం తిరుమలకు తీసుకొచ్చింది. సమితి ట్రస్టీ ఆర్.ఆర్.గోపాల్జి ఆధ్వర్యంలో తిరుమలకు చేరుకున్న గొడుగులకు టీటీడీ అధికారులు ఈఓ శ్యామల రావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఘన స్వాగతం పలికారు.