News July 8, 2024

పుంగనూరు: న్యాయ విభాగం ఏర్పాటు చేసిన పెద్దిరెడ్డి

image

వైసీపీ శ్రేణులపై టీడీపీ నాయకులు దాడి చేస్తున్న నేపథ్యంలో వారికి అండగా ఉండేలా పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి న్యాయ విభాగం ఏర్పాటు చేసినట్టు ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఇందుకోసం నలుగురు లాయర్లను నియమించినట్లు ఆయన పేర్కొన్నారు. దాడులను అడ్డుకుంటే.. తిరిగి వైసీపీ నాయకులపై కేసులు నమోదు చేయడం దారుణమని వెల్లడించారు.

Similar News

News November 25, 2025

అరుణాచలంలో కార్తీక దీపోత్సవాలు ప్రారంభం

image

తమిళనాడులోని అరుణాచల ఆలయంలో కార్తీక దీపోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. 10 రోజులు ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఇందులో ప్రధానమైన మహాదీప దర్శన వేడుకలు డిసెంబర్ 3న జరగనున్నాయి. ఆరోజు తెల్లవారుజామున 4గంటలకు ఆలయంలో భరణి దీపం వెలిగించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ వేడుకలకు 40లక్షల మందికి పైగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

News November 25, 2025

అరుణాచలంలో కార్తీక దీపోత్సవాలు ప్రారంభం

image

తమిళనాడులోని అరుణాచల ఆలయంలో కార్తీక దీపోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. 10 రోజులు ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఇందులో ప్రధానమైన మహాదీప దర్శన వేడుకలు డిసెంబర్ 3న జరగనున్నాయి. ఆరోజు తెల్లవారుజామున 4గంటలకు ఆలయంలో భరణి దీపం వెలిగించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ వేడుకలకు 40లక్షల మందికి పైగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

News November 25, 2025

5న తిరుమల దర్శనం టికెట్ల విడుదల

image

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి TTD కీలక ప్రకటన వెలువరించింది. జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు రోజుకు 15000 చొప్పున రూ.300 టికెట్లు ఇస్తామని తెలిపింది. డిసెంబర్ 5వ తేదీన మధ్యాహ్నం 3గంటలకు ఆన్‌లైన్‌లో టికెట్లను విడుదల చేస్తామని వెల్లడించింది. ఆరోజు టీటీడీ వెబ్‌సైట్ ద్వారానే టికెట్లు బుకింగ్ చేసుకోవాలని సూచించింది.