News April 10, 2024
పుంగనూరు: పెరిగిన పూల ధరలు

పండగలు నేపథ్యంలో పూల ధరలు పెరిగాయి. జిల్లాలో సాగయ్యే కనకాంబరాలు పూలు తక్కువగా రావడం, డిమాండు అధికంగా ఉండటంతో కిలో రూ.1000 ధర పలికింది. ఇక, బంతిపూల మాల రూ.200 నుంచి రూ.250 వరకు పలికాయి. కిలో బంతులు ఒకటో రకం రూ.120- నుంచి రూ. 100 ధరతో లభిస్తున్నాయి. మల్లెపూలు రకాలను బట్టి రూ. 400 నుంచి 700 వరకు ఉన్నాయి. పండుగల నేపథ్యంతో పాటు పూల సాగు తగ్గడంతో ధరల పెరుగుదల ఉన్నట్టు మార్కెట్ వర్గాలు తెలిపాయి.
Similar News
News April 23, 2025
ఇంటర్ ఎగ్జామ్ ఫీజు గడువు పొడిగింపు: ప్రిన్సిపల్

ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు చెల్లించడానికి ఈ నెల 25వ తేదీ వరకు ఇంటర్ బోర్డు గడువు పొడిగించినట్లు చిత్తూరు ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ జ్యోతిస్వరన్ తెలిపారు. మంగళవారం ఫీజు కట్టడానికి చివరి రోజు కాగా ఇంటర్ బోర్డు శుక్రవారం వరకు ఫీజు గడువు తేదీని పొడిగించిందన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
News April 22, 2025
చిత్తూరు: 24 నుంచి వేసవి సెలవులు

ఈనెల 24వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటిస్తూ రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ 12వ తేదీ పాఠశాలలు పునః ప్రారంభం అవుతాయని, కానీ ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులు జూన్ 5 వ తేదీన రీడీనెస్ యాక్టివిటీస్ కోసం రిపోర్ట్ చేయాలని ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు.
News April 22, 2025
చిత్తూరు : ఇంటర్ డీఐఈఓగా శ్రీనివాసులు

చిత్తూరుజిల్లా ఇంటర్మీడియట్ డీఐఈఓగా ఏ. శ్రీనివాసులు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేశారు. నెల్లూరు జిల్లా కేంద్రంలో డీకే ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసులును చిత్తూరు డీఐఈఓగా నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో చిత్తూరు డీఐఈఓగా పనిచేస్తున్న మౌలా తన పూర్వపు స్థానం కణ్ణన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్గా కొనసాగనున్నారు.