News May 24, 2024

పుంగనూరు: మహిళపై దాడి ఘటనలో ఐదుగురిపై కేసు

image

బీసీవై కార్యకర్త భార్యపై హత్యాయత్నం చేసిన ఐదుగురు వైసీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. బుధవారం రాత్రి మండలంలోని మాగాండ్లపల్లె పంచాయతీ బరిణేపల్లెకు చెందిన బీసీవై కార్యకర్త శంకర్ భార్య అంజమ్మపై అదే గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్తలు చందు, పురుషోత్తం, మంజు, శంకరమ్మ, చంద్రకళ దాడి చేశారు. ఈ సందర్భంగా ఇన్‌ఛార్జ్ డీఎస్పీ రాఘువీర్ రెడ్డి నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Similar News

News July 6, 2025

చిత్తూరు: జాతీయ లోక్ అదాలత్‌లో 203 కేసుల పరిష్కారం

image

పలమనేరు కోర్టు ఆవరణలో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో 203 కేసులు పరిష్కారమైనట్లు సీనియర్ సివిల్ జడ్జి ఆదినారాయణ తెలిపారు. సివిల్, క్రిమినల్, బ్యాంకు తదితర కేసులను పరిష్కరించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి లిఖిత, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎల్.భాస్కర్, న్యాయవాదులు, పోలీసులు పాల్గొన్నారు.

News July 5, 2025

చిత్తూరు: బాలికపై అత్యాచారం.. 20 ఏళ్ల జైలు శిక్ష

image

2020 జులై 20వ తేదీన మైనర్ బాలికపై రామకృష్ణ(47) అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో నిందితుడికి 2025 జులై 4వ తేదీ శుక్రవారం చిత్తూరు జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.5 వేలు జరిమానా విధించింది. ముద్దాయికి శిక్ష పడేలా కృషి చేసిన దిశ డీఎస్‌పీ బాబు ప్రసాద్, పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్, చౌడేపల్లి సీఐ భూపాల్, ఎస్సై శివశంకర్లను జడ్జ్ అభినందించారు.

News July 5, 2025

చిత్తూరు: బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం

image

పోలీసు శాఖలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు ఎస్పీ మణికంఠ శుక్రవారం ఆర్థిక సాయం అందజేశారు. ఎస్ ఆర్ పురం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ మృతి చెందిన కానిస్టేబుల్ ఆనంద్ బాబు సతీమణి మాధవి, గుడిపల్లి స్టేషన్‌లో మృతి చెందిన లక్ష్మీ భర్త ఆనంద్‌కు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున చెక్కులను ఆయన అందజేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హమీ ఇచ్చారు.