News March 17, 2025

పుకార్లకు చెక్ పెట్టేందుకు అటవీ శాఖ అధికారులు చర్యలు

image

తాండూరు మండలంలో పులి పిల్ల సంచరిస్తున్నట్లు వస్తున్న పుకార్లకు చెక్ పెట్టేందుకు స్థానిక అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ట్రాఫ్ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గత రెండు రోజుల క్రితం తాండూరు మండలం మల్కాపూర్ సమీపంలోని సిమెంట్ కర్మాగారం సమీపంలో పులిపిల్ల కనిపించినట్లు కార్మికులు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

Similar News

News December 19, 2025

SDPT: పంచాయతీ ఎన్నికల కిక్కు.. రూ.69.95 కోట్ల అమ్మకాలు

image

ఓ వైపు పంచాయతీ ఎన్నికలు.. మరోవైపు కొత్త వైన్ షాపుల స్టాక్ కొనుగోళ్లతో జిల్లాలో లిక్కర్ అమ్మకాలు భారీగా కొనసాగాయి. మూడు విడుతల్లో జరిగిన ఎన్నికల్లో మద్యం విక్రయాలు మత్తెక్కించాయి. డిసెంబర్ నెలలో ఇప్పటివరకు రూ.69.95 కోట్ల విలువ 74,678 కేసుల లిక్కర్,79,828 కేసుల బీర్ల విక్రయాలు సాగాయి. ఈ వారం రోజులపాటు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు మద్యంపై భారీగా ఖర్చు చేసినట్టు చర్చించుకుంటున్నారు.

News December 19, 2025

NZB: కానిస్టేబుల్ ప్రమోద్ భార్యకు రూ. కోటి చెక్కు

image

ఇటీవల విధి నిర్వహణలో మృతి చెందిన CCSకానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి రూ. కోటి చెక్కును పోలీస్ కమీషనర్ సాయి చైతన్య అందించారు. పోలీస్ సాలరీ ప్యాకేజ్ వర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సురెన్స్ క్లెయిమ్ రూపంలో పోలీస్ సాలరీ ప్యాకేజ్ పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సురెన్స్ క్లెయిమ్ రూపంలో ఈ చెక్ వచ్చింది. ఈ కార్యక్రమంలో ACP రాజా వెంకట్ రెడ్డి, SBI అధికారులు రవి కిరణ్, మహేశ్వర్ పాల్గొన్నారు.

News December 19, 2025

తరచూ తలనొప్పా! ఈ తప్పులు చేస్తున్నారా?

image

శరీరంలో నీటి శాతం తగ్గడం వల్ల మెదడు కుంచించుకుపోయి తలనొప్పి వస్తుంది. భోజనం స్కిప్ చేసినా సమస్య రావచ్చు. స్వీట్స్, పలు పిండి పదార్థాలు తిన్నప్పుడు కొందరికి ఈ ఇబ్బంది వస్తుంది. సరిగ్గా కూర్చోకపోయినా, ఎక్కువసేపు నిలబడినా కండరాలు ఒత్తిడికిగురై సమస్య రావచ్చు. పడుకునే ముందు గట్టిగా ఉన్న ఫుడ్ తిన్నా, నిద్రలో పళ్లు కొరికినా, రాత్రుళ్లు స్మోకింగ్, డ్రింకింగ్‌, నాణ్యతలేని నిద్ర తలనొప్పికి కారణం కావచ్చు.