News February 4, 2025

పుట్టపర్తిలో చైనీస్ న్యూ ఇయర్ వేడుకలు

image

ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో చైనీస్ న్యూ ఇయర్ వేడుకలు వైభవంగా జరిగాయి. సోమవారం రాత్రి ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్‌ సభ మందిరం వెలుపల చైనా దేశస్థులతో పాటు శ్రీ సత్యసాయి విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు, భక్తులు వేడుకలలో పాల్గొన్నారు. చైనాకు చెందిన దాదాపు 400 మంది భక్తులు పుట్టపర్తికి వచ్చి వారి దేశ సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు.

Similar News

News December 10, 2025

రాంబిల్లి: విద్యార్థుల ఆచూకీ కోసం పోలీసు బృందాలు గాలింపు

image

రాంబిల్లి మండలం హరిపురం బీసీటీ రెసిడెన్షియల్ స్కూల్ నుంచి మంగళవారం మధ్యాహ్నం అదృశ్యమైన ఆరుగురు విద్యార్థుల కోసం నాలుగు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు వద్ద వీరి కోసం పోలీసు బృందాలు ఆరా తీస్తున్నాయి. పదవ తరగతి చదువుతున్న జస్వంత్, హిమతేజ, భరత్, లక్ష్మణరావు, వరుణ్, రాజారావు చెట్టు ఎక్కి గోడ దూకి పారిపోయారు. సరిగా చదవడం లేదని ఉపాధ్యాయులు వీరిని మందలించినట్లు తెలుస్తోంది.

News December 10, 2025

సూర్యాపేట: బీఆర్‌ఎస్‌ కార్యకర్త దారుణ హత్య

image

సర్పంచ్ ఎన్నికల ప్రచారం సందర్భంగా నూతనకల్ (M) లింగంపల్లిలో మంగళవారం రాత్రి ఘర్షణ రక్తసిక్తమైంది. కాంగ్రెస్, BRS వర్గీయుల మధ్య చెలరేగిన ఘర్షణలో కర్రలు, రాళ్లతో సుమారు 70 మంది దాడి చేసుకున్నారు. తీవ్రంగా గాయపడిన BRS కార్యకర్త ఉప్పుల మల్లయ్యను చికిత్స కోసం HYD తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో చనిపోయినట్లు బంధువులు తెలిపారు. ఈ ఘటనలో 15 మందికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. గ్రామంలో పోలీసులు మోహరించారు.

News December 10, 2025

NTR: భర్త మరణాన్ని తట్టుకోలేక.. భార్య మృతి..!

image

వాంబేకాలనీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. క్యాటరింగ్ పనులు చేసే అజయ్ కుమార్ మంగళవారం ఛాతినొప్పితో 108లో ఆసుపత్రికి తరలిస్తుండగా మధ్యమార్గంలోనే మృతి చెందాడు. దీంతో ఆయన భార్య నాగలక్ష్మి తీవ్రంగా రోధించింది. అజయ్ కుమార్ అంత్యక్రియలు ముగించుకుని కుటుంబ సభ్యులు ఇంటికి తిరిగి వచ్చేసరికి, నాగలక్ష్మి సైతం కన్నుమూసింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటన స్థానికులను కంటతడి పెట్టించింది.