News February 4, 2025
పుట్టపర్తిలో చైనీస్ న్యూ ఇయర్ వేడుకలు

ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో చైనీస్ న్యూ ఇయర్ వేడుకలు వైభవంగా జరిగాయి. సోమవారం రాత్రి ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్ సభ మందిరం వెలుపల చైనా దేశస్థులతో పాటు శ్రీ సత్యసాయి విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు, భక్తులు వేడుకలలో పాల్గొన్నారు. చైనాకు చెందిన దాదాపు 400 మంది భక్తులు పుట్టపర్తికి వచ్చి వారి దేశ సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు.
Similar News
News December 7, 2025
రూ.24 రీఫండ్ కోసం రూ.87,000 పోగొట్టుకుంది

గుజరాత్లోని అహ్మదాబాద్లో ఓ మహిళ సైబర్ మోసానికి గురైంది. జెప్టోలో కూరగాయలు ఆర్డర్ చేసిన ఆమె రీఫండ్ కోసం పొరపాటున ఆన్లైన్లో రాంగ్ కస్టమర్ నంబర్కు కాల్ చేసింది. ఇదే అదనుగా కేటుగాళ్లు ఆమెకు వాట్సాప్లో APK ఫైల్ పంపించి బ్యాంక్ వివరాలతో మూడు అకౌంట్ల నుంచి రూ.87వేలు కొట్టేశారు. మోసపోయానని గ్రహించిన మహిళ సైబర్ హెల్ప్లైన్ నంబర్ 1930కి, పోలీసులకు ఫిర్యాదు చేసింది.
News December 7, 2025
కడియంలో “జనసేన”కేదీ ప్రాధాన్యత..?

కడియం మండలంలో జనసేనకి ప్రాధాన్యం తగ్గుతుందని ఆ పార్టీ శ్రేణులు అంతర్మధనంలో ఉన్నాయి. గతంలో మెజారిటీ ఎంపీటీసీలు, జడ్పీటీసీ స్థానం గెలిచినా ఎంపీపీ పదవిని టీడీపీకి త్యాగం చేశారు. తాజాగా సొసైటీ ఛైర్మన్ల నియామకంలోనూ టీడీపీ మూడు దక్కించుకోగా, జనసేనకు ఒక్కటే దక్కింది. ఇప్పటికే రెండు పదవులున్న ఎంపీపీ బంధువుకే మళ్లీ ఛైర్మన్ పదవి కట్టబెట్టారని జనసైనికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు లోకల్గా టాక్ నడుస్తోంది.
News December 7, 2025
కర్ణాటక కాంగ్రెస్లో ముగియని ‘కుర్చీ’ వివాదం

కర్ణాటక కాంగ్రెస్లో సిద్దరామయ్య, డీకే శివకుమార్ల మధ్య CM పీఠంపై ఏర్పడిన చిచ్చు ఇంకా రగులుతూనే ఉంది. గత వారం ఈ ఇద్దరితో అధిష్ఠానం చర్చించగా వివాదం సమసినట్లు కనిపించింది. కానీ తాజాగా ‘మార్పు’కు సిద్ధం కావాలని DK ఓ సమావేశంలో సహచరులకు సూచించడంతో అదింకా ముగియలేదని స్పష్టమవుతోంది. ‘దేవుడు అవకాశాలను మాత్రమే ఇస్తాడు. వాటితో మనం ఏం చేస్తామో అదే ముఖ్యం. ‘మార్పు’కు సిద్ధంగా ఉండండి’ అని వివరించారు.


