News August 17, 2024

పుట్టపర్తి విమానాశ్రయం నుంచి రెగ్యులర్ విమానాలు నడపడానికి చర్యలు

image

పుట్టపర్తిలోని శ్రీ సత్య సాయి విమానాశ్రయం నుంచి రెగ్యులర్ విమానాలు నడిపే విధంగా చర్యలు తీసుకుంటామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. శనివారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసిన అనంతరం ఆయన మాట్లాడారు. సత్యసాయి ట్రస్ట్ వర్గాలతో సంప్రదించి త్వరలో తగిన నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.

Similar News

News December 20, 2025

అనంత: ఒకే పాఠశాల నుంచి 52 మంది విద్యార్థులు

image

అనంతపురం జిల్లా కంబదూరు మండలం నూతిమడుగు జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన 52 మంది విద్యార్థులు ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. పీఈటీ సంజీవరాయుడు శిక్షణలో విద్యార్థులు ప్రతిభ చాటారని హెచ్‌ఎం రాజశేఖర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రస్థాయిలోనూ రాణించి పాఠశాలకు కీర్తి తీసుకురావాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను ఉపాధ్యాయ బృందం అభినందించింది.

News December 19, 2025

ఏబీసీ అవార్డులందుకున్న జిల్లా పోలీసులు

image

కేసుల చేధింపులో రాష్ట్రంలోనే అత్యుత్తమ ప్రతిభ చూపిన రాయదుర్గం అర్బన్, రూరల్ సీఐ జయనాయక్, వెంకటరమణ, వారి సిబ్బంది ఉత్తమ అవార్డులకు ఎంపికయ్యారు. డీజీపీ చేతుల మీదుగా ప్రతీ ఏడాది టాప్ త్రీ కేసులు చేధించిన వారికి ఏబీసీ అవార్డులు ఇచ్చి సత్కరించడం ఆనవాయితీ. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ఎస్పీ జగదీశ్, డీఎస్పీ రవిబాబుతో కలసి డీజీపీ హరీశ్ కుమార్ గుప్త చేతుల మీదుగా వారు అవార్డును అందుకున్నారు.

News December 19, 2025

‘విద్యార్థులకు వరంలా మారిన జేఎన్టీయూ వీసీ ఆలోచనలు’

image

అనంతపురం జేఎన్టీయూ విశ్వవిద్యాలయం గురువారం M/s. ExcelR Edtechతో MOU ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి సంబంధించి జేఎన్టీయూ వీసీ సుదర్శన రావు మాట్లాడుతూ.. ఈ అవగాహన ఒప్పందం వలన విశ్వవిద్యాలయం పరిధిలోని విద్యార్థులకు ఉపయోగపడే స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు, ఇంటర్న్‌షిప్‌లు ఆఫర్ చేస్తాయని తెలిపారు. కార్యక్రమంలో వీసీతో పాటు రిజిస్ట్రార్ కృష్ణయ్య, డైరెక్టర్లు సత్యనారాయణ, శోభా బిందు పాల్గొన్నారు.