News April 9, 2025

పురమిత్ర యాప్ ద్వారా సేవలు పొందండి: మౌర్య

image

రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రారంభించిన ‘పురమిత్ర’ యాప్ ద్వారా ప్రజలు మునిసిపల్ సేవలు పొందవచ్చని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య మంగళవారం తెలిపారు. ప్రజలు కార్యాలయాలు చుట్టూ తిరిగే పనిలేకుండా మున్సిపల్ సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పురమిత్ర యాప్‌ను రూపొందించిందన్నారు. 

Similar News

News December 13, 2025

కోల్‌కతాలో ఉద్రిక్తత.. HYDలో పోలీసుల అలర్ట్

image

మెస్సీ టూర్ సందర్భంగా కోల్‌కతా సాల్ట్ లేక్ స్టేడియంలో ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో HYDలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉప్పల్ స్టేడియం వద్ద అదనపు బలగాలను మోహరిస్తున్నారు. ఫ్యాన్స్ గ్రౌండ్‌లోకి రాకుండా చర్యలు చేపడుతున్నారు. ఇవాళ సాయంత్రం ఇక్కడ మెస్సీ మ్యాచ్ ఆడనున్న సంగతి తెలిసిందే. అటు సాల్ట్ లేక్ స్టేడియంలో అభిమానులు టెంట్లు, ఫ్లెక్సీలు, కుర్చీలను <<18551215>>ధ్వంసం చేశారు<<>>. పోలీసులు వారిని చెదరగొట్టారు.

News December 13, 2025

తిరుమలలో పరకామణి మీకు తెలుసా?

image

తిరుమలలో భక్తులు హుండీలో సమర్పించే మొక్కుబడులు, కానుకలను లెక్కించే ప్రదేశమే ‘పరకామణి’. పూర్వం ఇది శ్రీవారి ఆలయం లోపల, ఆనంద నిలయం వెనుక ఉండేది. ప్రస్తుతం భద్రత, సాంకేతిక పరిజ్ఞానంతో, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం ఎదురుగా పరకామణి భవనాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ వేలాది మంది భక్తులు సమర్పించిన కోట్ల రూపాయల కానుకల లెక్కింపు నిరంతరం జరుగుతూ ఉంటుంది. <<-se>>#VINAROBHAGYAMU<<>>

News December 13, 2025

గజ్వేల్: పల్లె పోరులో కారు జోరు

image

మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగిన గజ్వేల్ నియోజకవర్గంలోని ఆరు మండల కేంద్రాలలో బీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో లేని జగదేవ్‌పూర్, ములుగు, మర్కూక్, వర్గల్, రాయపోల్, దౌల్తాబాద్ మండల కేంద్రాలలో బీఆర్‌ఎస్‌ హవా స్పష్టంగా కనిపించింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గంలోని మేజర్ పంచాయతీల్లో ఈ గెలుపు కీలకంగా మారింది.