News February 28, 2025
పురుషులు 973, మహిళలు 886 మంది ఓటు వేశారు..!

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. జిల్లాలో 23 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ చేపట్టగా 2022 మంది ఓటర్లకు గాను 1859 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. ఇందులో పురుష ఓటర్లు 973, మహిళా ఓటర్లు 886 మంది ఓటు వేశారని వెల్లడించారు. 91.94% నమోదయిందని, భద్రత నడుమ బ్యాలెట్ బాక్సులను నల్గొండ రిసెప్షన్ సెంటర్కు తరలించామన్నారు.
Similar News
News January 10, 2026
బడ్ చిప్ విధానం అంటే ఏమిటి?(2/2)

చెరకు ట్రేలను ఒకదానిపై ఒకటి వరుసగా పేర్చి ప్లాస్టిక్ షీట్లతో గాలి తగలకుండా కప్పాలి. మొలకెత్తిన ట్రేలను 4వ రోజు గ్రీన్హౌస్లోకి మార్చుకొని రోజు విడిచి రోజు నీటితో తడపాలి. విత్తు పొడవు 5 సెం.మీ. ట్రై క్యావిటీ 98 సి.సి కలిగినవి అయితే మొలకలు 25-30 రోజుల వరకు ఆరోగ్యవంతంగా ఉండి మంచి దిగుబడి వస్తాయి. బడ్ చిప్ పద్ధతిలో నారు పెంచడానికి లేత తోటల నుంచి పురుగులు, తెగుళ్లు ఆశించని గడలనే ఎంపిక చేసుకోవాలి.
News January 10, 2026
తుర్కపల్లి: గుప్తనిధుల కోసం తవ్వకాలు.. ఆరుగురు అరెస్ట్

మాదాపూర్ గ్రామ శివారులో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో ఎస్సై తక్యుద్దీన్ తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి ఒక హిటాచీ, కారు, పూజ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
News January 10, 2026
సంక్రాంతికి ఊరు వెళ్తున్నారా..! సమాచారం ఇవ్వండి- ఎస్పీ

సంక్రాంతి పండుగకు ఊర్లకు వెళ్లేవారు జాగ్రత్తలు పాటించాలని, పోలీసులకు తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని విలువైన వస్తువులు లాకర్ల లోనే భద్రపరుచుకోవాలని వనపర్తి జిల్లా ఎస్పీ సునీత రెడ్డి విజ్ఞప్తి చేశారు. పండుగకు ఊర్లకు వెళ్తారని ఇదే అవకాశంగా భావించి దొంగలు చోరీలకు పాల్పడే ప్రమాదం ఉందన్నారు. ముందుగానే పోలీసులకు సమాచారం ఇస్తే పెట్రోలింగ్లో భాగంగా ఆయా ఇండ్లపై ప్రత్యేక నిఘా ఉంచుతామని అన్నారు.


