News April 7, 2024

పులివెందుల అడ్డా ఈసారి ఎవరిది.?

image

రాష్ట్ర రాజకీయాల్లో పులివెందుల ప్రత్యేకం. ఇక్కడ మొత్తం 17 సార్లు ఎన్నికలు జరిగితే అందులో 13 సార్లు YS కుటుంబానిదే పెత్తనం. YS కుటుంబంపై 5 సార్లు పోటీచేసిన సతీశ్ రెడ్డి వైసీపీలో చేరడంతో జగన్ మెజారిటీ మరింత పెరుగుతుందని పార్టీ శ్రేణులు అంచనా వేసుకుంటున్నారు. TDP అభ్యర్థి బీటెక్ రవి గెలుపుపై ధీమాగా ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి వివేకా సతీమణి సౌభాగ్యమ్మ పోటీ చేసే అవకాశం ఉంది. మరి ఎవరు గెలుస్తారు?

Similar News

News February 25, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు ఇలా.!

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో బుధవారం బంగారం వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,780
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,518
* వెండి 10 గ్రాముల ధర రూ.2,762.

News February 25, 2026

వేంపల్లి: నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో వైఎస్ జగన్

image

వేంపల్లి మండలం నందిపల్లెలోని నూతనంగా నిర్మించిన నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో మాజీ సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన రోడ్డు మార్గాన పులివెందులలోని తన నివాసానికి చేరుకొని మధ్యాహ్నం 2 గంటల వరకు తన నివాసంలో విశ్రాంతి తీసుకోనున్నారు. అనంతరం రెండు గంటలకు ఆయన తన క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు.

News February 25, 2026

కడప: 3వ రోజు ఇంటర్ పరీక్షలకు 96% విద్యార్థులు హాజరు

image

కడప జిల్లాలో బుధవారం ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లిష్ పేపర్-1 పరీక్షకు 96% విద్యార్థులు హాజరయ్యారు. నేడు 62 సెంటర్లలో 18,165 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా.. 17,391 మంది రాశారు. 774 మంది గైర్హాజరయ్యారు. జనరల్ విద్యార్థుల్లో 16,685 మందికి గాను.. 16,068 మంది హాజరవ్వగా, 617 మంది పరీక్షలు రాయలేదు. ఒకేషనల్ విద్యార్థుల్లో 1,480 మందికి గాను.. 1,323 మంది హాజరవ్వగా, 157 మంది గైర్హాజరయ్యారు.