News June 17, 2024
పులివెందుల: బైకుపై వెళ్తుండగా విద్యుత్ తీగలు తగిలి కిందపడి గాయాలు

పులివెందుల నివాసి యశ్య అనే యువకుడు ఆదివారం సాయంత్రం బైకుపై వెళ్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి కిందపడి గాయాలయ్యాయి. అది గమనించిన స్థానికులు అంబులెన్స్ ద్వారా రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి సీటీ స్కాన్ నిర్వహించి చికిత్స అందిస్తున్నారు. యువకుడు పులివెందుల నివాసిగా గుర్తించారు.
Similar News
News November 25, 2025
పులివెందులలో YS జగన్

మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో మూడు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం సాయంత్రం పులివెందులకు చేరుకున్నారు. జన సందోహం మధ్య ప్రజలకు అభివాదం చేసుకుంటూ బాకరాపురంలోని తన క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. జగన్ పులివెందులకు రావడంతో క్యాంప్ కార్యాలయం వద్ద జన సందడి నెలకొంది. ఆయనను జిల్లా నేతలు కలిశారు.
News November 25, 2025
ప్రొద్దుటూరులో నేటి బంగారం ధరలు

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో నేడు మంగళవారం బంగారం వెండి ధరలు వివరాలు:
☛ బంగారం 24 క్యారెట్లు 1 గ్రాము: రూ.12590
☛ బంగారం 22 క్యారెట్లు 1 గ్రాము: రూ.11583
☛ వెండి 10 గ్రాములు రూ.1616
ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో నేడు మంగళవారం బంగారం వెండి ధరలు వివరాలు:
News November 25, 2025
ప్రొద్దుటూరు వ్యాపారి తనికంటి సోదరులకు బెయిల్..!

ప్రొద్దుటూరు జ్యువెలరీ వ్యాపారి తనికంటి శ్రీనివాసులు, ఆయన సోదరుడు వెంకటస్వామికి ప్రొద్దుటూరు మొదటి ADM కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు జడ్జి సురేంద్రనాధ రెడ్డి సోమవారం రాత్రి ఉత్తర్వులు ఇచ్చారు. HYDకు చెందిన హేమంత్ శర్మ ఇచ్చిన ఫిర్యాదుపై బెదిరింపు, కిడ్నాప్, దాడి కేసుల్లో తనికంటి సోదరులను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. వ్యక్తిగత ష్యూరిటీతో వారికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.


