News February 26, 2026

పులివెందుల సీఐ ఇంట్లో భారీగా నగదు

image

ఏసీబీ దాడుల్లో దొరికిన పులివెందుల రూరల్ సీఐ వెంకటరమణ ఇంట్లో ఏసీబీ అధికారుల విచారణ ముగిసింది. ఇందులో రూ. 6 లక్షల నగదు, 200 గ్రాముల బంగారం, 54 విదేశీయ మద్యం బాటిల్లు, విలువైన పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం నగదు సీఐ రెండో భార్య ఇంట్లో గుర్తించారు. ఇందులో డీఎస్పీ మురళీ నాయక్ ప్రమేయం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News April 16, 2026

కడప ప్రభుత్వ జూనియర్ కాలేజీ టాపర్స్ వీరే..!

image

కడప ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ఫలితాల్లో గ్రూపుల వారీగా టాపర్ల వివరాలు. ఫస్ట్ ఇయర్: MPC – రెడ్డి వెంకట గణేశ్ (450), BIPC – మంజునాథ్(459), CEC – ఉమా శంకర్(473), HEC – నరసింహారావు(438), CSC – చిన్న వర్ధన్(403),
సెకండ్ ఇయర్: MPC – అబ్జల్ భాషా (874), BIPC – హర్షిని (930), CEC – అశోక్ కుమార్ (811), HEC – వీరాంజనేయులు(695), CSC – గంగాధర (843).

News April 16, 2026

మైదుకూరు: ఇంటర్‌లో ఫెయిల్.. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి

image

మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన జి. హరి ఈశ్వర్(18) సమీపంలోని చెరువులో పడి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. మృతుడు ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం విడుదలైన ఫలితాలలో ఫెయిల్ అవ్వడంతో ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అలాగే ఈశ్వర్ తండ్రి మునెయ్య ఆరోగ్య పరిస్థితి సరిగా లేదు.

News April 15, 2026

కడప జిల్లాలో ఇంటర్ ఒకేషనల్ ఫలితాలు ఇలా.!

image

కడప జిల్లాలో ఇంటర్ ఒకేషనల్ పరీక్షలు 2,382 మంది విద్యార్థులు రాశారు. వీరిలో 1,080 మంది పాస్ అయ్యారు.
1st ఇయర్ 592 మంది బాలురు రాయగా.. 285(31%) పాస్ అయ్యారు. 664 మంది బాలికల్లో 278(42%) పాస్ అయ్యారు. 2nd ఇయర్ బాలురు 473 మందిలో 231(49%) పాస్ అయ్యారు. బాలికలు 657 మందిలో 386(58%) పాస్ అయ్యారు. ఒకేషనల్ ఉత్తీర్ణతలో బాలుర కన్నా బాలికలే ముందంజలో ఉన్నారు.