News January 8, 2025
పుల్లంపేటలోని శ్రీ సంజీవరాయస్వామికి పొంగళ్లు
పుల్లంపేట మండలం తిప్పాయపల్లె గ్రామంలో ఉన్న శ్రీ సంజీవరాయ స్వామి పొంగళ్లు ఈ నెల 12వ తేదీ , సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం వైభవంగా జరుగుతాయని గ్రామ పెద్దలు తెలిపారు అయితే ఎక్కడైనా మహిళలు పొంగళ్లు పెట్టండం చూసుంటారు. కానీ ఇక్కడ మాత్రం కేవలం పురుషులే పొంగళ్లు పెట్టడం అనాదిగా వస్తున్న ఆచారం. ముందు రోజు రాత్రి నుంచే కోలాటం, చెక్క భజన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.
Similar News
News January 20, 2025
BREAKING: కడప జిల్లా ఎస్పీగా ఈజీ అశోక్ కుమార్
కడప జిల్లా నూతన ఎస్పీగా ఈజీ అశోక్ కుమార్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఆదేశాలు ఇవ్వగా ఇందులో భాగంగా కడపకు అశోక్ కుమార్ను నియమించారు. ఇక్కడ ఉన్న పూర్వపు ఎస్పీ హర్షవర్ధన్ రాజును నవంబర్లో అధికారులు బదిలీ చేయడంతో అప్పటినుంచి ఇంఛార్జి ఎస్పీగా అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు కొనసాగుతూ వచ్చారు.
News January 20, 2025
ప్రొద్దుటూరు: ‘ప్రభుత్వం అప్పులు, ఖర్చులను తెలపాలి’
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులను, ఖర్చులను మీడియా ద్వారా ప్రజలకు తెలపాలని ప్రజాపక్షం పార్టీ అధ్యక్షుడు పుత్తా లక్ష్మిరెడ్డి తెలిపారు. సోమవారం ప్రొద్దుటూరు తహశీల్దార్ గంగయ్యకు ఆయన వినతిపత్రం అందించారు. లక్ష్మిరెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు వివిధ రకాల పన్నుల ద్వారా చెల్లించిన సొమ్మును ప్రభుత్వం అప్పులకు చెల్లిస్తోందన్నారు. ప్రతినెల ప్రభుత్వం చేస్తున్న ఖర్చులను, అప్పులను ప్రజలకు వివరించాలన్నారు.
News January 20, 2025
కడప జిల్లా డీఈవోగా షంషుద్దీన్
కడప జిల్లా నూతన జిల్లా విద్యాశాఖ అధికారిగా కర్నూలు జిల్లా తాండ్రపాడు డైట్ సీనియర్ లెక్చరర్ ఎస్. షంషుద్దీన్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు జిల్లా విద్యాశాఖ అధికారిగా వ్యవహరించిన మీనాక్షిపై ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు ఆరోపణలు, ఉద్యమాలు చేసిన నేపథ్యంలో ఆమె స్థానంలో ఈయనను పాఠశాల విద్య ప్రభుత్వ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు.