News July 26, 2024
పుల్లలచెరువు: 108 వాహనంలో సుఖ ప్రసవం

పుల్లలచెవు మండలంలోని మానేపల్లికి చెందిన టి.ఆదిలక్ష్మి 108 వాహనంలో శుక్రవారం సుఖ ప్రసవం అయ్యింది. సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. కాన్పు కోసం 108 వాహనంలో యర్రగొండపాలెం ఆసుపత్రికి వస్తున్న సమయంలో రామసముద్రం సమీపంలో నొప్పులతో బాధపడుతుండగా సిబ్బంది ఆమెకు ప్రసవం చేశారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు 108 సిబ్బంది వెన్నా గాలిరెడ్డి, దుపాటి శ్రీను తెలిపారు.
Similar News
News November 4, 2025
నష్టం వివరాలను త్వరగా పంపించండి: కలెక్టర్

తుఫాన్ నేపథ్యంలో జరిగిన నష్టం వివరాలను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలన చేసి వెంటనే నివేదికలు పంపించాలని కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. ఈ మేరకు ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం నుంచి మండల స్థాయి అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో చేపట్టిన ఈ పంట ప్రక్రియను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలన్నారు. అలాగే దెబ్బతిన్న రహదారుల వివరాలను సైతం పంపాలన్నారు.
News November 4, 2025
ఆఫీస్కు వస్తే.. ముందు ఈ పని చేయండి: కలెక్టర్

ప్రతిరోజూ కార్యాలయానికి రాగానే ‘మీకోసం’ అర్జీల స్టేటస్ పరిశీలించటమే ప్రథమ పనిగా పెట్టుకోవాలని పలువురు జిల్లా స్థాయి అధికారులకు కలెక్టర్ రాజాబాబు స్పష్టం చేశారు. మీకోసం అర్జీలు పరిష్కారం అవుతున్న తీరుపై సంబంధిత విభాగ అధికారులతో మంగళవారం ఒంగోలు ప్రకాశం భవనంలోని తన ఛాంబర్లో ఆయన సమీక్షించారు. అర్జీల ఆడిట్, సకాలంలో పరిష్కారం, రీఓపెన్ కాకుండా చూడాలన్నారు.
News November 4, 2025
ప్రకాశం: ఉచితంగా 3 వీలర్ మోటారు సైకిల్స్.. అప్లై చేయండిలా.!

రాష్ట్రంలోని అర్హులైన దివ్యాంగులకు ఉచితంగా 1750 రెట్రోఫిట్ త్రీ వీలర్ మోటారు సైకిళ్లను అందజేస్తామని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి మంగళవారం తెలిపారు. ఈనెల 25లోపు www.apdascac.ap.gov.in వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. 18 నుంచి 45 ఏళ్లలోపు ఉండి 70% అంగవైకల్యం కలిగినవారు అర్హులన్నారు.


